Terrible Incident: సిద్దిపేటలో దారుణం.. ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం..
- సిద్దిపేటలో దారుణ ఘటన..
- మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాందుడు..
- ఆరుబయట ఆడుకున్న సమయంలో ఎత్తుకొని వెళ్లి అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible Incident: సిద్దిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై ఓ కామాందుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరుబయట ఆడుకున్న సమయంలో ఎత్తుకొనివెళ్లి అత్యాచారం చేశాడు. ఆడుకుంటున్న చిన్నారిపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్లు ఆ చిన్నారిని అక్కడే వదిలేసి పారిపోయాడు. చిన్నారి ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో షాక్ తిన్నారు. వెంటనే చిన్నారిని తీసుకుని వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారం చేసిన యువకుడు యూపీకి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
Read also: Bus Accident: భయానక రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి.. 23 మందికి గాయాలు..
Also Read
ట్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఈ నెల 19న మైత్రివనంలో ఉండే మూడేళ్ళ చిన్నారిపై అత్యాచారం జరిగిందన్నారు. నేపాల్ కి చెందిన కుటుంబం అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నారని అన్నారు. తాతతో చిన్నారి ఆడుకుంటుండగా అక్కడే పెయింటింగ్ పని చేసే యూపీకి చెందిన అజయ్ చిన్నారిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. అత్యాచారం తర్వాత నిందితుడు పారిపోయే యత్నం చేయగా పట్టుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపామని అన్నారు.
Read also: Road Accident: కారు – ట్రక్కు ఢీ.. నలుగురు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం..
ప్రభుత్వం ఎన్ని చట్టాలు, కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మానవ మృగాలకు మహిళలు బలవుతున్నారు. నెలరోజుల పసికందు నుంచి వృద్ధురాలి వరకు వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై, చిన్న పిల్లలపై లైంగిక దాడులను అరికట్టాలంటే కఠినమైన చట్టాలు, విద్య విధానంలో మార్పు తేవాలి. కుటుంబ విలువలు నేర్పాలి. మన దేశంలో పేదరికం, అక్షరాస్యత పూర్తిగా నిర్మూలించడం అసాధ్యం. చదువుకున్న వాడికైతే సంస్కారం నేర్పగలము కానీ చదువుకున్నప్పటికీ మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టుకున్న వాడికి, నాగరికత, సమాజం పట్ల బాధ్యత, భయం లేని వారికి ఎవరు నేర్పుతారు? దీనికి తోడు మొబైల్ ఫోన్లు కూడా మరొక కారణంగా మారుతున్నాయి. వీటి ద్వారా కన్న కూతురిపై కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కీచకులు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తే తప్పా సమాజంలో అత్యాచారాలకు ఆపలేమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trains Cancellation: బిగ్ అలర్ట్.. ఆ డివిజన్లలో పలు రైళ్లు రద్దు
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!