Terrible Incident: సిద్దిపేటలో దారుణం.. ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం..
- సిద్దిపేటలో దారుణ ఘటన..
- మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాందుడు..
- ఆరుబయట ఆడుకున్న సమయంలో ఎత్తుకొని వెళ్లి అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible Incident: సిద్దిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై ఓ కామాందుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరుబయట ఆడుకున్న సమయంలో ఎత్తుకొనివెళ్లి అత్యాచారం చేశాడు. ఆడుకుంటున్న చిన్నారిపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్లు ఆ చిన్నారిని అక్కడే వదిలేసి పారిపోయాడు. చిన్నారి ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో షాక్ తిన్నారు. వెంటనే చిన్నారిని తీసుకుని వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారం చేసిన యువకుడు యూపీకి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
Read also: Bus Accident: భయానక రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి.. 23 మందికి గాయాలు..
Also Read
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
ట్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఈ నెల 19న మైత్రివనంలో ఉండే మూడేళ్ళ చిన్నారిపై అత్యాచారం జరిగిందన్నారు. నేపాల్ కి చెందిన కుటుంబం అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నారని అన్నారు. తాతతో చిన్నారి ఆడుకుంటుండగా అక్కడే పెయింటింగ్ పని చేసే యూపీకి చెందిన అజయ్ చిన్నారిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. అత్యాచారం తర్వాత నిందితుడు పారిపోయే యత్నం చేయగా పట్టుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపామని అన్నారు.
Read also: Road Accident: కారు – ట్రక్కు ఢీ.. నలుగురు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం..
ప్రభుత్వం ఎన్ని చట్టాలు, కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మానవ మృగాలకు మహిళలు బలవుతున్నారు. నెలరోజుల పసికందు నుంచి వృద్ధురాలి వరకు వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై, చిన్న పిల్లలపై లైంగిక దాడులను అరికట్టాలంటే కఠినమైన చట్టాలు, విద్య విధానంలో మార్పు తేవాలి. కుటుంబ విలువలు నేర్పాలి. మన దేశంలో పేదరికం, అక్షరాస్యత పూర్తిగా నిర్మూలించడం అసాధ్యం. చదువుకున్న వాడికైతే సంస్కారం నేర్పగలము కానీ చదువుకున్నప్పటికీ మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టుకున్న వాడికి, నాగరికత, సమాజం పట్ల బాధ్యత, భయం లేని వారికి ఎవరు నేర్పుతారు? దీనికి తోడు మొబైల్ ఫోన్లు కూడా మరొక కారణంగా మారుతున్నాయి. వీటి ద్వారా కన్న కూతురిపై కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కీచకులు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తే తప్పా సమాజంలో అత్యాచారాలకు ఆపలేమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trains Cancellation: బిగ్ అలర్ట్.. ఆ డివిజన్లలో పలు రైళ్లు రద్దు
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!