Siddipet : యాప్తో బయటపడిన యూరియా మాఫియా..!
- సిద్దిపేటలో యూరియా పంపిణీలో వరుస అక్రమాలు
- బైరాన్పల్లిలో రైతుకు అందాల్సిన 18 బస్తాలు మాయం
- యాప్ అలర్ట్తో బయటపడిన వ్యాపారుల నిర్వాకం
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet : సిద్దిపేట జిల్లాలో యూరియా పంపిణీ వ్యవహారం వరుస అక్రమాలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వం పారదర్శకత కోసం తీసుకువచ్చిన యాప్, వ్యాపారుల అక్రమాలను బట్టబయలు చేస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు వ్యాపారులు, రైతులకు అందాల్సిన యూరియాను పక్కదారి పట్టిస్తూ, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, వ్యాపారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చేర్యాల ఘటన మరువకముందే.. బైరాన్ పల్లిలో మరో అక్రమం
జిల్లాలోని చేర్యాలలో సుమారు 6,429 యూరియా బస్తాలు మాయమైన ఘటన మరువకముందే, తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బైరాన్ పల్లిలోని రైతు సేవా కేంద్రం నుంచి రైతుకు అందాల్సిన 18 యూరియా బస్తాలను నిర్వాహకుడు అక్రమంగా మాయం చేశాడు. ధూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన రైతు కుమార్, తన యూరియా బస్తాల కోసం బుక్ చేసుకున్నాడు. అయితే, తాను యూరియా తీసుకోకముందే, బస్తాలు తీసుకున్నట్లుగా ఫోన్కు మెసేజ్ రావడంతో సదరు రైతు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు.
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
నిలదీస్తే నిర్లక్ష్యపు సమాధానాలు.. ఆగని మాఫియా
ఈ అక్రమంపై రైతు కుమార్ రైతు సేవా కేంద్రం యజమానిని వెళ్లి నిలదీయగా, ఆయన ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. యూరియా అక్రమాలపై ఉన్నతాధికారులు అడపాదడపా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో యూరియా మాఫియా ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ యాప్లో వస్తున్న అలర్ట్లు అక్రమాలను బయటపెడుతున్నా, చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!