Komuravelli Mallanna: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. కేతమ్మ, మేడల దేవి సమేత మల్లికార్జున స్వామి వారి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొమురవెల్లి మల్లన్న జాతరలో భాగంగా మంత్రి హరీశ్ రావు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు, బంగారు కిరీటం సమర్పించారు.
Read also: Online Trading Fraud: లక్షకు లక్ష.. 4వేలు కోట్లతో ఉడాయించిన కేటుగాళ్లు
అనంతరం మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.11 వేల కోట్లు వెచ్చించిందని, అలాగే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రూ.50 కోట్లు, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.70 కోట్లు మంజూరు చేశారన్నారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి రూ.30 కోట్లు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూ.100 కోట్ల ప్రత్యేక గ్రాంట్ను ప్రకటించారని ఆయన తెలిపారు. కొమురవెల్లిలో బిల్డింగ్ క్యూ లైన్ల కోసం రూ.11 కోట్ల ప్రత్యేక గ్రాంట్ను ప్రకటించినట్లు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆలయ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆలయంలో 50 పడకల చౌల్ట్రీ, ఇతర సౌకర్యాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
Gudivada Casino Case: గుడివాడ క్యాసినో ఎపిసోడ్.. ఇవాళ ఐటీ విచారణ