వానపాములా పడకుంటే.. తాచు పాములా సీఎం కేసీఆర్ కాటేస్తున్నాడని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. G.O.317-సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని వైఎస్ షర్మిల అన్నారు. భార్యా భర్తలను విడదీసిందని… .9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దొర తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు ఉందని.. G.O.ను మాత్రం రద్దు చేయడం లేదని ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.
Read Also: బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరు: వినోద్ కుమార్
ఉద్యోగుల సమస్యలను తీరుస్తారని చందాలు వేసి గెలిపించుకొన్న ఉద్యోగ సంఘాలు… పాలు పోసి పెంచిన పాము లాగా ఉద్యోగులనే కాటేస్తుంటే, అధికారం ముందు వానపాములై పడుకొంటే చావే శరణ్యం అయింది ఉద్యోగులకు అంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల. దొరగారి పోకడలకు ఉద్యోగులు సైతం బంగారు తెలంగాణలో చావుబాట పడుతున్నారని… ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వ లేని చేతకాని ముఖ్యమంత్రి కేసీఆర్ మనకొద్దని ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై విమర్శల దాడులకు దిగారు.
పాలు పోసి పెంచిన పాము లాగా ఉద్యోగులనే కాటేస్తుంటే, అధికారం ముందు వానపాములై పడుకొంటే చావే శరణ్యం అయింది ఉద్యోగులకు. దొరగారి పోకడలకు ఉద్యోగులు సైతం బంగారు తెలంగాణలో చావుబాట పడుతున్నారు. ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వడం 2/2#చేతకాని_ముఖ్యమంత్రి_మనకొద్దు #ChetakaniMukhyamantriManakoddu
— YS Sharmila (@realyssharmila) January 11, 2022