Sankranti Rush : సంక్రాంతికి రైళ్లలో సీట్ల కష్టాలు.. ఇప్పుడెలా..!
- సంక్రాంతి ముందే పెరిగిన రైళ్ల రద్దీ
- తక్కువ ధరలతో రైలు ప్రయాణానికే మొగ్గు
- రద్దైన కీలక రైళ్లతో ప్రయాణికుల కష్టాలు
- ప్రత్యేక రైళ్లు నడపాలంటూ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti Rush : సాధారణంగా సంక్రాంతి పండుగకు ఏపీలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లలో పండుగను ఘనంగా జరుపుకోవడానికి హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థిరపడిన లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతుంటారు. అయితే, పండుగకు ఇంకా నెల రోజుల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉన్నప్పటికీ, సొంతూళ్లకు వెళ్లాలనుకునే నగరవాసుల ప్రయాణ కష్టాలు మాత్రం ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి.
ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సు ఛార్జీలతో పోలిస్తే రైలు టిక్కెట్ ధరలు చాలా తక్కువగా ఉండటం వలన, రైళ్లలో ప్రయాణించడానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, చాలా మంది నగరవాసులు సుమారు రెండు నెలల ముందుగానే తమ ప్రయాణ టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. ఫలితంగా, పండుగకు ముందు, పండుగ సమయంలో ప్రయాణించే ముఖ్యమైన రైళ్లలో దాదాపుగా సీట్లన్నీ నిండిపోయాయి. ఇప్పుడు చివరి నిమిషంలో టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడటంతో, ఎవరైనా టిక్కెట్లను రద్దు చేసుకుంటే తమకు దొరుకుతాయేమో అనే ఒకే ఒక ఆశాభావంతో వేలాది మంది ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
రైలు ప్రయాణికులకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు మరింత పెరగడానికి రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడం ఒక ముఖ్య కారణం. ముఖ్యంగా కరోనా సమయంలో రద్దు చేయబడిన కాచిగూడ-టాటానగర్ రైలును నేటికీ తిరిగి పునరుద్ధరించకపోవడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు కాచిగూడ నుంచి గుంటూరు, విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస వంటి తీర ప్రాంతాల మీదుగా టాటానగర్కు వెళ్లేది. నగరవాసుల నుంచి ఈ రైలుకు చాలా ఎక్కువ డిమాండ్ ఉండేది. అదే విధంగా, గతంలో ప్రత్యేకంగా నడిపిన కాచిగూడ-కాకినాడ రైలును కూడా నిలిపివేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, రద్దీని తగ్గించేందుకు వీలుగా, తక్షణమే రద్దు చేసిన టాటానగర్, కాకినాడ రైళ్లను పునరుద్ధరించాలని, మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రయాణికులు రైల్వే అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్?
తాజావార్తలు
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
-
Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
-
UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
-
IPL 2026 Final: ఆర్సీబీ vs జీటీ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఫైనల్కు డిసైడ్ చేసే మూడు ప్లేయర్స్ బ్యాటిల్స్ ఇవే!
-
kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..