Double Bedroom Scam: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం.. 2.5 కోట్లు దోచేసిన BHEL ఉద్యోగి
- సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం..
- 69 మందిని మోసం చేసిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్..
- రూ. 2.5 కోట్లు వసూలు చేసిన ప్రసన్నకుమార్, జోష్ బ్రదర్స్..
- అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని పేదలను నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడు. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్ పై బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి ద్వారా పరిచయమైన ప్రసన్న కుమార్.. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ. 3 లక్షల నుంచి నాలుగైదు లక్షలు వసూలు చేశాడని పేర్కొంటున్నారు. మొత్తం 69 మంది దగ్గర నుంచి రూ. రెండు కోట్ల 50 లక్షల రూపాయల వరకు మోసం చేశాడని ఆరోపణలు చేస్తున్నారు. అయితే, జోష్ అనే వ్యక్తి ద్వారా డబ్బులను ప్రసన్న కుమార్ దండుకున్నాడు.. 2021 నుంచి నేడు, రేపు ఇప్పిస్తామంటూ ప్రసన్న కుమార్ మాయమాటలు చెప్తున్నాడని బాధితులు పేర్కొంటున్నారు.
Read Also: CP Sajjanar: అర్ధరాత్రి సీపీ సజ్జనార్ పెట్రోలింగ్.. రౌడీషీటర్ల ఇళ్లలో తనిఖీలు
Also Read
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
అయితే, కిష్టారెడ్డిపేటలోని ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్తే వాచ్ మెన్, కుక్కలతో దాడి చేయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో బీహచ్ఈఎల్ ఉద్యోగి ప్రసన్నకుమార్ పై ఫిర్యాదు చేశారు. జోష్ ను నిలదీయగా ప్రసన్న కుమార్ కే మొత్తం డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మాకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వకపోయినా సరే, మా డబ్బులు మాకు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!