DK Aruna: సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..?
- పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగింది..
- సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను భయపెట్టారు..
- భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారు..
- ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు..
DK Aruna: సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సంగారెడ్డి జైలులో లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారినీ బీజేపీ ఎంపీలు డీకే అరుణ పరామర్శించారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను భయపెట్టారని ఆరోపించారు. భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారన్నారు. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి.. మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండని సూచించారు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారని తెలిపారు.
Read also: Mulugu: ఆ గ్రామానికి అరిష్టం పట్టింది.. జంగాలపల్లిలో వరుస మరణాల కలకలం..
Also Read
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
- JaggaReddy: 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..?
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
మీరు సీఎం అయితే.. మా నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటే.. మీరు జనాలపై కక్ష కట్టారని తెలిపారు. సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? అని ప్రశ్నించారు. ఓటేసి గెలిపించిన జనాల కంటే.. మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కొడంగల్ వాసులు కాదు వలస వచ్చారన్నారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారన్నారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యం అని సలహాఇచ్చారు. పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయిండు అని మండిపడ్డారు. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసి ప్రజల ఉసురు కూడా పోసుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఇలా చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్ అహంకారం వీడాలి..ఒప్పించి భూములు తీసుకోవాలని డీకే అరుణ సూచించారు.
V.C. Sajjanar: అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదే..!! సజ్జనార్ ట్వీట్ వైరల్..
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!