Salu Dora Selavu Dora Digital Board: మళ్లీ వెలసిన ఫెక్సీలు.. సాలుదొర సెలవు దొర అంటూ డిజిటల్ బోర్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salu Dora Selavu Dora Digital Board: తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశం, పోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ కసరత్ షురూ చేస్తోంది. అంతేకాకుండా ఇతర పార్టీల నేతలను రంగంలోకి దింపుతోంది. దక్షిణాదిలో కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణపైనే పెట్టుకుంది. ఇక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని వ్యూహాలు రచిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి దించేందుకు వ్యూహరచన చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సాలుదొర.. సెలవు దొర పేరుతో డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు కల్వకుంట్ల కౌంట్ డౌన్ అని నామకరణం చేసి.. కేసీఆర్ ను అధికారం నుంచి దింపేందుకు ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో డిజిటల్ బోర్డులో గంటలు, నిమిషాలు, సెకన్లు చేర్చారు.
Read also: Rajamouli-Mahesh Movie Update: మహేష్తో తీసే సినిమా స్టోరీ లైన్ ఇదేనన్న రాజమౌళి
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
అయితే ఈ డిజిటల్ బోర్డును నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేయగా.. అనుమతి లేకుండా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారనే కారణంతో దాన్ని తొలగించాలని జీహెచ్ ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఆదేశాలతో బోర్డు ప్రదర్శనను కొద్దిరోజుల పాటు నిలిపివేసింది బీజేపీ. ఆ తర్వాత ఉప ఎన్నికల కారణంగా ఈ బోర్డును బీజేపీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. మొన్నటి ఉప ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరడంతో డిజిటల్ బోర్డు మళ్లీ ప్రత్యక్షమైంది. నిన్న (నవంబర్ 19)న మళ్లీ తాజాగా పునఃప్రారంభించి.. ఎన్నికలు ముగిసే వరకు బోర్డు ఉంచనున్నట్లు తెలిపారు బీజేపీ శ్రేణులు. మళ్లీ ప్రారంభమైన ఈ బోర్డులో కేసీఆర్ను అధికారం నుంచి తప్పించేందుకు ఇంకా 382 రోజుల సమయం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై సీఎం కేసీఆర్ ఎలా స్పిందిచనున్నారు? జీహెచ్ ఎంసీ అధికారులు చెప్పిన బీజేపీ మళ్లీ ఈ డిజిటల్ బోర్డును ఎర్పాటు చేయడం పై ఆంతర్య ఏమిటి? అంటు రాష్ట్ర రాజకీయంలో చర్చ జరుగుతుంది.
Harish Rao: డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!