Salu Dora Selavu Dora Digital Board: మళ్లీ వెలసిన ఫెక్సీలు.. సాలుదొర సెలవు దొర అంటూ డిజిటల్ బోర్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salu Dora Selavu Dora Digital Board: తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశం, పోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ కసరత్ షురూ చేస్తోంది. అంతేకాకుండా ఇతర పార్టీల నేతలను రంగంలోకి దింపుతోంది. దక్షిణాదిలో కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణపైనే పెట్టుకుంది. ఇక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని వ్యూహాలు రచిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి దించేందుకు వ్యూహరచన చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సాలుదొర.. సెలవు దొర పేరుతో డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు కల్వకుంట్ల కౌంట్ డౌన్ అని నామకరణం చేసి.. కేసీఆర్ ను అధికారం నుంచి దింపేందుకు ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో డిజిటల్ బోర్డులో గంటలు, నిమిషాలు, సెకన్లు చేర్చారు.
Read also: Rajamouli-Mahesh Movie Update: మహేష్తో తీసే సినిమా స్టోరీ లైన్ ఇదేనన్న రాజమౌళి
Also Read
- Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్...
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
అయితే ఈ డిజిటల్ బోర్డును నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేయగా.. అనుమతి లేకుండా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారనే కారణంతో దాన్ని తొలగించాలని జీహెచ్ ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఆదేశాలతో బోర్డు ప్రదర్శనను కొద్దిరోజుల పాటు నిలిపివేసింది బీజేపీ. ఆ తర్వాత ఉప ఎన్నికల కారణంగా ఈ బోర్డును బీజేపీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. మొన్నటి ఉప ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరడంతో డిజిటల్ బోర్డు మళ్లీ ప్రత్యక్షమైంది. నిన్న (నవంబర్ 19)న మళ్లీ తాజాగా పునఃప్రారంభించి.. ఎన్నికలు ముగిసే వరకు బోర్డు ఉంచనున్నట్లు తెలిపారు బీజేపీ శ్రేణులు. మళ్లీ ప్రారంభమైన ఈ బోర్డులో కేసీఆర్ను అధికారం నుంచి తప్పించేందుకు ఇంకా 382 రోజుల సమయం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై సీఎం కేసీఆర్ ఎలా స్పిందిచనున్నారు? జీహెచ్ ఎంసీ అధికారులు చెప్పిన బీజేపీ మళ్లీ ఈ డిజిటల్ బోర్డును ఎర్పాటు చేయడం పై ఆంతర్య ఏమిటి? అంటు రాష్ట్ర రాజకీయంలో చర్చ జరుగుతుంది.
Harish Rao: డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్
తాజావార్తలు
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్ను మార్చేసింది.. చైతూ, అఖిల్కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!