Rythu Bharosa Funds Released : రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల
- సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫాం కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- ఆయిల్ ఫాం కర్మాగారాన్ని రైతులకు అంకితమిచ్చిన సీఎం రేవంత్
- రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
- 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్లు విడుదల చేశాం. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bharosa Funds Released : సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. జిల్లాలో రూ. 775.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 3,600 కోట్ల నిధులను నేరుగా జమ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయాన్ని అందిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
అభివృద్ధి పనుల విషయానికి వస్తే, సిద్దిపేట , గజ్వేల్ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిధులను కేటాయిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా నంగునూరు మండలం నర్మెట్టలో రూ. 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు, సిద్దిపేట మున్సిపాలిటీలో రూ. 141.34 కోట్లతో నీటి సరఫరా , భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఎన్సాన్పల్లిలో రూ. 78 కోట్లతో నిర్మించిన జిల్లా జైలు భవనం, రూ. 15 కోట్లతో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి, , రూ. 3.60 కోట్లతో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు. అలాగే నంగునూరు మండలం గట్లమల్యాల , సిద్దిపేట మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్లో కొత్తగా నిర్మించిన పిహెచ్సి (PHC) భవనాలను కూడా ఆయన ప్రారంభించారు.
Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..
గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కొండపాకలో రూ. 200 కోట్లతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే క్రమంలో మర్కూక్లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అదనపు మౌలిక సదుపాయాల కోసం రూ. 16.62 కోట్లను కేటాయించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ మర్కూక్ , జగదేవ్పూర్ మండలాల్లో సుమారు రూ. 18 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయాలను (IOC) రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా సిద్దిపేట జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని, ఈ అభివృద్ధి పనులు జిల్లా రూపురేఖలను మారుస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
-
CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
-
BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!