Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించుతోంది. ముఖ్యంగా పోలీసుల విచారణలో ఉన్న నిందితుల ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం, వాహనాలపై ‘మీడియా’ స్టిక్కర్లు వేసుకుని తిరగడం వంటి అంశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విచారణ పూర్తికాకముందే నిందితులను దోషులుగా చిత్రీకరించేలా సాగుతున్న ఈ ధోరణి పట్ల ధర్మాసనం ఆందోళన చెందింది.
నగరాల్లో చాలామంది తమ వ్యక్తిగత వాహనాలపై ‘మీడియా’ అని స్టిక్కర్లు అంటించుకుని తిరగడంపై జస్టిస్ బాగ్చీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఇది ఒక రకమైన ‘డిజిటల్ అరెస్ట్’ లాంటిదని అభిప్రాయపడ్డారు. అంటే.. అధికారం లేకపోయినా మీడియా పేరుతో చట్టవిరుద్ధంగా వ్యవహరించడం లేదా ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం వంటివి జరుగుతున్నాయని కోర్టు భావించింది. టీవీ ఛానెళ్ల కంటే సోషల్ మీడియాలో నియంత్రణ తక్కువగా ఉందని, మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామే మీడియా అని భావించడం వల్ల ‘న్యాయమైన విచారణ’ కు విఘాతం కలుగుతోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
Also Read
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
పోలీసుల అత్యుత్సాహంపై చురకలు
నిందితులను మోకాళ్లపై కూర్చోబెట్టడం, తాళ్లతో కట్టడం లేదా వీధుల్లో ఊరేగించడం వంటి దృశ్యాలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో నిందితులపై ముందే ఒక ప్రతికూల భావన ఏర్పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. దర్యాప్తు సంస్థల పని బాధితులకు లేదా నిందితులకు అనుకూలంగా ఉండటం కాదని, కేవలం నిజాన్ని వెలికితీయడమేనని కోర్టు గుర్తుచేసింది. పోలీసుల మీడియా బ్రీఫింగ్లు విచారణను ప్రభావితం చేసేలా ఉండకూడదని స్పష్టం చేసింది.
సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసమే నడుస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు, పోలీసుల మీడియా బ్రీఫింగ్లకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్రాలకు ఇప్పటికే మూడు నెలల గడువు ఇచ్చామని తెలిపింది. ఈ అంశంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని భావించిన కోర్టు.. ఏప్రిల్ తర్వాత పూర్తి వివరాలతో రావాలని సూచించడంతో పిటిషనర్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
-
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!