Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించుతోంది. ముఖ్యంగా పోలీసుల విచారణలో ఉన్న నిందితుల ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం, వాహనాలపై ‘మీడియా’ స్టిక్కర్లు వేసుకుని తిరగడం వంటి అంశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విచారణ పూర్తికాకముందే నిందితులను దోషులుగా చిత్రీకరించేలా సాగుతున్న ఈ ధోరణి పట్ల ధర్మాసనం ఆందోళన చెందింది.
నగరాల్లో చాలామంది తమ వ్యక్తిగత వాహనాలపై ‘మీడియా’ అని స్టిక్కర్లు అంటించుకుని తిరగడంపై జస్టిస్ బాగ్చీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఇది ఒక రకమైన ‘డిజిటల్ అరెస్ట్’ లాంటిదని అభిప్రాయపడ్డారు. అంటే.. అధికారం లేకపోయినా మీడియా పేరుతో చట్టవిరుద్ధంగా వ్యవహరించడం లేదా ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం వంటివి జరుగుతున్నాయని కోర్టు భావించింది. టీవీ ఛానెళ్ల కంటే సోషల్ మీడియాలో నియంత్రణ తక్కువగా ఉందని, మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామే మీడియా అని భావించడం వల్ల ‘న్యాయమైన విచారణ’ కు విఘాతం కలుగుతోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
పోలీసుల అత్యుత్సాహంపై చురకలు
నిందితులను మోకాళ్లపై కూర్చోబెట్టడం, తాళ్లతో కట్టడం లేదా వీధుల్లో ఊరేగించడం వంటి దృశ్యాలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో నిందితులపై ముందే ఒక ప్రతికూల భావన ఏర్పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. దర్యాప్తు సంస్థల పని బాధితులకు లేదా నిందితులకు అనుకూలంగా ఉండటం కాదని, కేవలం నిజాన్ని వెలికితీయడమేనని కోర్టు గుర్తుచేసింది. పోలీసుల మీడియా బ్రీఫింగ్లు విచారణను ప్రభావితం చేసేలా ఉండకూడదని స్పష్టం చేసింది.
సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసమే నడుస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు, పోలీసుల మీడియా బ్రీఫింగ్లకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్రాలకు ఇప్పటికే మూడు నెలల గడువు ఇచ్చామని తెలిపింది. ఈ అంశంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని భావించిన కోర్టు.. ఏప్రిల్ తర్వాత పూర్తి వివరాలతో రావాలని సూచించడంతో పిటిషనర్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!