Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించుతోంది. ముఖ్యంగా పోలీసుల విచారణలో ఉన్న నిందితుల ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం, వాహనాలపై ‘మీడియా’ స్టిక్కర్లు వేసుకుని తిరగడం వంటి అంశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విచారణ పూర్తికాకముందే నిందితులను దోషులుగా చిత్రీకరించేలా సాగుతున్న ఈ ధోరణి పట్ల ధర్మాసనం ఆందోళన చెందింది.
నగరాల్లో చాలామంది తమ వ్యక్తిగత వాహనాలపై ‘మీడియా’ అని స్టిక్కర్లు అంటించుకుని తిరగడంపై జస్టిస్ బాగ్చీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఇది ఒక రకమైన ‘డిజిటల్ అరెస్ట్’ లాంటిదని అభిప్రాయపడ్డారు. అంటే.. అధికారం లేకపోయినా మీడియా పేరుతో చట్టవిరుద్ధంగా వ్యవహరించడం లేదా ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం వంటివి జరుగుతున్నాయని కోర్టు భావించింది. టీవీ ఛానెళ్ల కంటే సోషల్ మీడియాలో నియంత్రణ తక్కువగా ఉందని, మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామే మీడియా అని భావించడం వల్ల ‘న్యాయమైన విచారణ’ కు విఘాతం కలుగుతోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
పోలీసుల అత్యుత్సాహంపై చురకలు
నిందితులను మోకాళ్లపై కూర్చోబెట్టడం, తాళ్లతో కట్టడం లేదా వీధుల్లో ఊరేగించడం వంటి దృశ్యాలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో నిందితులపై ముందే ఒక ప్రతికూల భావన ఏర్పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. దర్యాప్తు సంస్థల పని బాధితులకు లేదా నిందితులకు అనుకూలంగా ఉండటం కాదని, కేవలం నిజాన్ని వెలికితీయడమేనని కోర్టు గుర్తుచేసింది. పోలీసుల మీడియా బ్రీఫింగ్లు విచారణను ప్రభావితం చేసేలా ఉండకూడదని స్పష్టం చేసింది.
సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసమే నడుస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు, పోలీసుల మీడియా బ్రీఫింగ్లకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్రాలకు ఇప్పటికే మూడు నెలల గడువు ఇచ్చామని తెలిపింది. ఈ అంశంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని భావించిన కోర్టు.. ఏప్రిల్ తర్వాత పూర్తి వివరాలతో రావాలని సూచించడంతో పిటిషనర్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!