Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించుతోంది. ముఖ్యంగా పోలీసుల విచారణలో ఉన్న నిందితుల ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం, వాహనాలపై ‘మీడియా’ స్టిక్కర్లు వేసుకుని తిరగడం వంటి అంశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విచారణ పూర్తికాకముందే నిందితులను దోషులుగా చిత్రీకరించేలా సాగుతున్న ఈ ధోరణి పట్ల ధర్మాసనం ఆందోళన చెందింది.
నగరాల్లో చాలామంది తమ వ్యక్తిగత వాహనాలపై ‘మీడియా’ అని స్టిక్కర్లు అంటించుకుని తిరగడంపై జస్టిస్ బాగ్చీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఇది ఒక రకమైన ‘డిజిటల్ అరెస్ట్’ లాంటిదని అభిప్రాయపడ్డారు. అంటే.. అధికారం లేకపోయినా మీడియా పేరుతో చట్టవిరుద్ధంగా వ్యవహరించడం లేదా ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం వంటివి జరుగుతున్నాయని కోర్టు భావించింది. టీవీ ఛానెళ్ల కంటే సోషల్ మీడియాలో నియంత్రణ తక్కువగా ఉందని, మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామే మీడియా అని భావించడం వల్ల ‘న్యాయమైన విచారణ’ కు విఘాతం కలుగుతోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
పోలీసుల అత్యుత్సాహంపై చురకలు
నిందితులను మోకాళ్లపై కూర్చోబెట్టడం, తాళ్లతో కట్టడం లేదా వీధుల్లో ఊరేగించడం వంటి దృశ్యాలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో నిందితులపై ముందే ఒక ప్రతికూల భావన ఏర్పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. దర్యాప్తు సంస్థల పని బాధితులకు లేదా నిందితులకు అనుకూలంగా ఉండటం కాదని, కేవలం నిజాన్ని వెలికితీయడమేనని కోర్టు గుర్తుచేసింది. పోలీసుల మీడియా బ్రీఫింగ్లు విచారణను ప్రభావితం చేసేలా ఉండకూడదని స్పష్టం చేసింది.
సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసమే నడుస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు, పోలీసుల మీడియా బ్రీఫింగ్లకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్రాలకు ఇప్పటికే మూడు నెలల గడువు ఇచ్చామని తెలిపింది. ఈ అంశంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని భావించిన కోర్టు.. ఏప్రిల్ తర్వాత పూర్తి వివరాలతో రావాలని సూచించడంతో పిటిషనర్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
తాజావార్తలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!