Rythu Bharosa Funds Released : రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల
- సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫాం కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- ఆయిల్ ఫాం కర్మాగారాన్ని రైతులకు అంకితమిచ్చిన సీఎం రేవంత్
- రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
- 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్లు విడుదల చేశాం. -సీఎం రేవంత్ రెడ్డి
Rythu Bharosa Funds Released : సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. జిల్లాలో రూ. 775.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 3,600 కోట్ల నిధులను నేరుగా జమ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయాన్ని అందిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
అభివృద్ధి పనుల విషయానికి వస్తే, సిద్దిపేట , గజ్వేల్ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిధులను కేటాయిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా నంగునూరు మండలం నర్మెట్టలో రూ. 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు, సిద్దిపేట మున్సిపాలిటీలో రూ. 141.34 కోట్లతో నీటి సరఫరా , భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఎన్సాన్పల్లిలో రూ. 78 కోట్లతో నిర్మించిన జిల్లా జైలు భవనం, రూ. 15 కోట్లతో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి, , రూ. 3.60 కోట్లతో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు. అలాగే నంగునూరు మండలం గట్లమల్యాల , సిద్దిపేట మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్లో కొత్తగా నిర్మించిన పిహెచ్సి (PHC) భవనాలను కూడా ఆయన ప్రారంభించారు.
Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..
గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కొండపాకలో రూ. 200 కోట్లతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే క్రమంలో మర్కూక్లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అదనపు మౌలిక సదుపాయాల కోసం రూ. 16.62 కోట్లను కేటాయించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ మర్కూక్ , జగదేవ్పూర్ మండలాల్లో సుమారు రూ. 18 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయాలను (IOC) రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా సిద్దిపేట జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని, ఈ అభివృద్ధి పనులు జిల్లా రూపురేఖలను మారుస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
-
Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..
-
Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్ఫ్లిక్స్లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం
-
Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?
-
Women reservation bill: ఓడి గెలిచిన బీజేపీ.. గెలిచి ఓడిన కాంగ్రెస్..!
ట్రెండింగ్
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!