Revanthreddy:రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. ఆ బాధ్యత నాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుంది, రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. ఆ బాధ్యత నాది అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అసైన్డ్ భూములు రైతుల నుండి లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల తరఫున కొట్లాడిన వారిపై కేసులు ఎత్తేస్తాం అన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వారిని వదిలేయండి అని అడిగిన చరిత్ర సోనియా గాంధీది అని అన్నారు రేవంత్ రెడ్డి. రాజద్రోహం కేసుల చట్టం రద్దు చేయాలన్నది మా విధానం అని అన్నారు. కెసిఆర్ సీఎం అయ్యాకే షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది అని విమర్శించారు.
షుగర్ ఫ్యాక్టరీ నడపలేని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎం నడిపిస్తారని విమర్శించారు. కెసిఆర్ అవసరం లేని వాటికి ఎక్కువగా అప్పులు చేసి.. ఆయనకు ఎందులో లాభం ఉందో అది చేసుకున్నాడని విమర్శించారు. రైతుల మొత్తం అప్పు 30 వేల కోట్ల వరకు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత నాలుగేళ్లలో బ్యాంకులకి తిరిగి చెల్లించుకుంటామని తెలిపారు.
Also Read
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
- Jagadish Reddy : పవన్ వ్యాఖ్యలు ఐటెం సాంగ్స్లాంటివే.. జగదీష్ రెడ్డి సెటైర్లు.!
- OTR : జూబ్లీ హిల్స్ BRSలో మూడు ముక్కలాట! కేటీఆర్కే తలనొప్పిగా మారిన హాట్ సీట్?
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
65 యేండ్ల పాలనలో తెచ్చిన మెరుగైన వ్యవస్థను కెసిఆర్ ద్వంసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ లో చెరుకు ,పసుపు..కందులు..జొన్నలు సాగు మాయం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ వరి సాగు చేయడం పెరిగింది.. ఇదేదో నాదే గొప్ప అని చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేశారు. కాళేశ్వరానికి కోటి ఎకరాలకు సాగు నీరు అందించిన అని కెసిఆర్ చెప్తున్నాడు, 30 లక్షల పంపు సెట్లు ఎందుకు వాడుకలో ఉన్నాయి చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం అసైన్డ్ భూములు రైతుల నుండి లాక్కుని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని నిప్పులు చెరిగారు.
ప్రజల తరుపున కొట్లాడిన వారిపై కేసులు ఎత్తెస్థం మన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వారిని వదిలేయండి అని అడిగిన చరిత్ర సోనియా గాంధీ ది అని గుర్తు చేశారు. రాజద్రోహం కేసుల చట్టం రద్దు చేయాలన్నది మా విధానమే నని రేవంత్ కొనియాడారు. షుగర్ ఫ్యాక్టరీ ..కెసిఆర్ సీఎం అయ్యాకే మూత పడ్డాయని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీనే నడప లేని కెసిఆర్.. ప్రభుత్వాన్నీ ఏం నడిపిస్తారని ఎద్దేవ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
అడవికి గొర్రెలు మేపడానికి వెళ్తే.. ముసుగు దొంగలు కొన్ని దొంగతనం చేస్తారు… గొర్రెల కాపరికి గొర్రెను ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసు అని రేవంత్ అన్నారు. ముసుగు దొంగ నడుము విరగొట్టడం ఎలాగో నాకు తెలుసని పేర్కొన్నారు. సీఎం అధ్యక్షతన ఫార్మర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని , రైతు కమిషన్ ..రైతు సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతామన్నారు రేవంత్ రెడ్డి.
- Tags
- bjp
- cm kcr
- congress
- revanth reddy
- TRS
తాజావార్తలు
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లదా?
-
Nurse Transfer Request: మంత్రి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న నర్సు.. కారణం ఏంటంటే?
-
Heavy Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
Dhanush OM : కర ప్లాప్ తర్వాత కెరీర్లో బిగ్ రిస్క్ చేస్తున్న ధనుష్
-
Manoj Bajpayee : చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు.. మనోజ్ బాజ్పాయ్ ఆవేదన
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!