Revanthreddy:రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. ఆ బాధ్యత నాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుంది, రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. ఆ బాధ్యత నాది అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అసైన్డ్ భూములు రైతుల నుండి లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల తరఫున కొట్లాడిన వారిపై కేసులు ఎత్తేస్తాం అన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వారిని వదిలేయండి అని అడిగిన చరిత్ర సోనియా గాంధీది అని అన్నారు రేవంత్ రెడ్డి. రాజద్రోహం కేసుల చట్టం రద్దు చేయాలన్నది మా విధానం అని అన్నారు. కెసిఆర్ సీఎం అయ్యాకే షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది అని విమర్శించారు.
షుగర్ ఫ్యాక్టరీ నడపలేని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎం నడిపిస్తారని విమర్శించారు. కెసిఆర్ అవసరం లేని వాటికి ఎక్కువగా అప్పులు చేసి.. ఆయనకు ఎందులో లాభం ఉందో అది చేసుకున్నాడని విమర్శించారు. రైతుల మొత్తం అప్పు 30 వేల కోట్ల వరకు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత నాలుగేళ్లలో బ్యాంకులకి తిరిగి చెల్లించుకుంటామని తెలిపారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
65 యేండ్ల పాలనలో తెచ్చిన మెరుగైన వ్యవస్థను కెసిఆర్ ద్వంసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ లో చెరుకు ,పసుపు..కందులు..జొన్నలు సాగు మాయం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ వరి సాగు చేయడం పెరిగింది.. ఇదేదో నాదే గొప్ప అని చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేశారు. కాళేశ్వరానికి కోటి ఎకరాలకు సాగు నీరు అందించిన అని కెసిఆర్ చెప్తున్నాడు, 30 లక్షల పంపు సెట్లు ఎందుకు వాడుకలో ఉన్నాయి చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం అసైన్డ్ భూములు రైతుల నుండి లాక్కుని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని నిప్పులు చెరిగారు.
ప్రజల తరుపున కొట్లాడిన వారిపై కేసులు ఎత్తెస్థం మన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వారిని వదిలేయండి అని అడిగిన చరిత్ర సోనియా గాంధీ ది అని గుర్తు చేశారు. రాజద్రోహం కేసుల చట్టం రద్దు చేయాలన్నది మా విధానమే నని రేవంత్ కొనియాడారు. షుగర్ ఫ్యాక్టరీ ..కెసిఆర్ సీఎం అయ్యాకే మూత పడ్డాయని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీనే నడప లేని కెసిఆర్.. ప్రభుత్వాన్నీ ఏం నడిపిస్తారని ఎద్దేవ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
అడవికి గొర్రెలు మేపడానికి వెళ్తే.. ముసుగు దొంగలు కొన్ని దొంగతనం చేస్తారు… గొర్రెల కాపరికి గొర్రెను ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసు అని రేవంత్ అన్నారు. ముసుగు దొంగ నడుము విరగొట్టడం ఎలాగో నాకు తెలుసని పేర్కొన్నారు. సీఎం అధ్యక్షతన ఫార్మర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని , రైతు కమిషన్ ..రైతు సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతామన్నారు రేవంత్ రెడ్డి.
- Tags
- bjp
- cm kcr
- congress
- revanth reddy
- TRS
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!