Revanthreddy:రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. ఆ బాధ్యత నాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుంది, రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. ఆ బాధ్యత నాది అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అసైన్డ్ భూములు రైతుల నుండి లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల తరఫున కొట్లాడిన వారిపై కేసులు ఎత్తేస్తాం అన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వారిని వదిలేయండి అని అడిగిన చరిత్ర సోనియా గాంధీది అని అన్నారు రేవంత్ రెడ్డి. రాజద్రోహం కేసుల చట్టం రద్దు చేయాలన్నది మా విధానం అని అన్నారు. కెసిఆర్ సీఎం అయ్యాకే షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది అని విమర్శించారు.
షుగర్ ఫ్యాక్టరీ నడపలేని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎం నడిపిస్తారని విమర్శించారు. కెసిఆర్ అవసరం లేని వాటికి ఎక్కువగా అప్పులు చేసి.. ఆయనకు ఎందులో లాభం ఉందో అది చేసుకున్నాడని విమర్శించారు. రైతుల మొత్తం అప్పు 30 వేల కోట్ల వరకు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత నాలుగేళ్లలో బ్యాంకులకి తిరిగి చెల్లించుకుంటామని తెలిపారు.
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
65 యేండ్ల పాలనలో తెచ్చిన మెరుగైన వ్యవస్థను కెసిఆర్ ద్వంసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ లో చెరుకు ,పసుపు..కందులు..జొన్నలు సాగు మాయం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ వరి సాగు చేయడం పెరిగింది.. ఇదేదో నాదే గొప్ప అని చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేశారు. కాళేశ్వరానికి కోటి ఎకరాలకు సాగు నీరు అందించిన అని కెసిఆర్ చెప్తున్నాడు, 30 లక్షల పంపు సెట్లు ఎందుకు వాడుకలో ఉన్నాయి చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం అసైన్డ్ భూములు రైతుల నుండి లాక్కుని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని నిప్పులు చెరిగారు.
ప్రజల తరుపున కొట్లాడిన వారిపై కేసులు ఎత్తెస్థం మన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వారిని వదిలేయండి అని అడిగిన చరిత్ర సోనియా గాంధీ ది అని గుర్తు చేశారు. రాజద్రోహం కేసుల చట్టం రద్దు చేయాలన్నది మా విధానమే నని రేవంత్ కొనియాడారు. షుగర్ ఫ్యాక్టరీ ..కెసిఆర్ సీఎం అయ్యాకే మూత పడ్డాయని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీనే నడప లేని కెసిఆర్.. ప్రభుత్వాన్నీ ఏం నడిపిస్తారని ఎద్దేవ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
అడవికి గొర్రెలు మేపడానికి వెళ్తే.. ముసుగు దొంగలు కొన్ని దొంగతనం చేస్తారు… గొర్రెల కాపరికి గొర్రెను ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసు అని రేవంత్ అన్నారు. ముసుగు దొంగ నడుము విరగొట్టడం ఎలాగో నాకు తెలుసని పేర్కొన్నారు. సీఎం అధ్యక్షతన ఫార్మర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని , రైతు కమిషన్ ..రైతు సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతామన్నారు రేవంత్ రెడ్డి.
- Tags
- bjp
- cm kcr
- congress
- revanth reddy
- TRS
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..