CM Revanth Reddy : చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.. అవి ఎక్కడికీ పోవు
- "చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి".. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
- ప్రతిపక్ష కుటుంబ పంచాయతీలలో మాకు ఆసక్తి లేదు
- నాలుగు కోట్ల ప్రజల వెంట నేను ఉన్నాను..
- కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటి పార్టీ : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షంపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన ఆయన, “చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అవి ఎక్కడికీ పోవు” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Mark: ఆసక్తికరంగా కిచ్చా సుదీప్ “మార్క్” టైటిల్ గ్లింప్స్
Also Read
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
- DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
- Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
“నవ్వుతూ కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. కానీ చేసిన పాపాలు ఊరికే పోవు. తప్పకుండా అనుభవించాల్సిందే. చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి” అని రేవంత్ వ్యాఖ్యానించారు.అంతేకాకుండా ప్రతిపక్ష నేతల మధ్య జరుగుతున్న అంతర్గత గొడవలపై కూడా ఆయన స్పందించారు. “మీ పంపకాలలో వచ్చిన పంచాయతీ మీరు పూడ్చుకోవాలి. మీ కుటుంబంలో, మీ వర్గంలో ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారు. ఆ విషయాల్లో మమ్మల్ని లాగకండి. మా ప్రభుత్వానికి, నాకు ఎలాంటి ఆసక్తి లేదు” అని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల వెనుక తాము ఉన్నారన్న ఆరోపణలపై కూడా సీఎం స్పందించారు. “హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ ఉన్నాడు అంటారు… మరొకరు కవిత వెనుక ఉన్నాడని అంటారు. నిజానికి నేను నాయకుణ్ణి. నేనుంటే ముందుంటా. మా వాళ్లకు తోడుంటా. అంత చెత్త గళ్ళ వెనుక నేను ఎందుకు ఉండాలి? నాలుగు కోట్ల ప్రజల వెంట నేను ఉన్నాను, వారికోసం పని చేస్తాను” అని చెప్పారు. ప్రతిపక్షాలపై మరోసారి కఠినంగా విమర్శలు చేస్తూ, “మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. మీ పార్టీ కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటిది. కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ” అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Ukraine-Russia: ఉక్రెయిన్పై రష్యా భీకరదాడులు.. డ్రోన్లు, క్షిపణులు ప్రయోగం
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!