Revanth Reddy: బండి సంజయ్, కేఏ పాల్ మాటలకి పెద్ద తేడా ఉండదు.. రేవంత్ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Satires On Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు, కేఏ పాల్ మాటలకు పెద్ద తేడా ఉండదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ నిరాశలో ఉన్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోజులో తమ దగ్గరున్న వాళ్లను బండి సంజయ్ ఎత్తుకుపోయాడని, ఇప్పుడు ఏమైందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా.. కాంగ్రెస్ని గెలిపించమని బండి సంజయ్ అన్నారని గుర్తు చేశారు. బండి సంజయ్ మాటలను సీరియస్గా కాకుండా, సానుభూతితో చూడాలని సూచించారు. బండి సంజయ్ పట్ల సానుభూతి తప్ప.. వేరే విషయం ఉండదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని.. కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టేనని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను.. రేవంత్ రెడ్డి ఈ విధంగా కౌంటర్లు ఇచ్చారు.
Mahi V Raghav: డిస్నీ+ హాట్స్టార్ పరువు తీశారంటే.. ‘పంది’తో గొడవ పడలేనంటున్న డైరెక్టర్!
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ఇదే సమయంలో.. తెలంగాణ ప్రభుత్వంపై కూడా రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో భూముల ధరలు పెరగడానికి ప్రభుత్వమే కారణమైతే.. రైతుల భూములకు ఎందుకంత ధర చెల్లించడం లేదని ప్రశ్నించారు. రేపు తానే తెలంగాణను అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్తే.. కేసీఆర్ దాన్ని కూడా ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్కి ఏది నచ్చితే అది అన్వయించుకోవడం.. రాజకీయ వ్యభిచార లక్షణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. అమరవీరుల పేర్లు లేకుండా అమరస్థూపం ఏంటని ప్రశ్నించారు. పవిత్రమైన అమరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు. ఏడాదిలోనే ప్రగతి భవన్ కట్టగలిగినప్పుడు.. అమరవీరుల స్థూపం కట్టేందుకు 9 సంవత్సరాలు ఎందుకు పట్టిందని నిలదీశారు. సచివాలయ నిర్మాణంలోనూ అవినీతి జరిగిందన్న ఆయన.. వీటిపై విజిలెన్స్ విచారణ జరిపి, అందరినీ జైలుకు పంపుతామన్నారు.
Bihar: పట్టపగలే బీహార్లో కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
తాజావార్తలు
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!