Revanth Reddy: బండి సంజయ్, కేఏ పాల్ మాటలకి పెద్ద తేడా ఉండదు.. రేవంత్ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Satires On Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు, కేఏ పాల్ మాటలకు పెద్ద తేడా ఉండదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ నిరాశలో ఉన్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోజులో తమ దగ్గరున్న వాళ్లను బండి సంజయ్ ఎత్తుకుపోయాడని, ఇప్పుడు ఏమైందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా.. కాంగ్రెస్ని గెలిపించమని బండి సంజయ్ అన్నారని గుర్తు చేశారు. బండి సంజయ్ మాటలను సీరియస్గా కాకుండా, సానుభూతితో చూడాలని సూచించారు. బండి సంజయ్ పట్ల సానుభూతి తప్ప.. వేరే విషయం ఉండదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని.. కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టేనని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను.. రేవంత్ రెడ్డి ఈ విధంగా కౌంటర్లు ఇచ్చారు.
Mahi V Raghav: డిస్నీ+ హాట్స్టార్ పరువు తీశారంటే.. ‘పంది’తో గొడవ పడలేనంటున్న డైరెక్టర్!
Also Read
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
ఇదే సమయంలో.. తెలంగాణ ప్రభుత్వంపై కూడా రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో భూముల ధరలు పెరగడానికి ప్రభుత్వమే కారణమైతే.. రైతుల భూములకు ఎందుకంత ధర చెల్లించడం లేదని ప్రశ్నించారు. రేపు తానే తెలంగాణను అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్తే.. కేసీఆర్ దాన్ని కూడా ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్కి ఏది నచ్చితే అది అన్వయించుకోవడం.. రాజకీయ వ్యభిచార లక్షణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. అమరవీరుల పేర్లు లేకుండా అమరస్థూపం ఏంటని ప్రశ్నించారు. పవిత్రమైన అమరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు. ఏడాదిలోనే ప్రగతి భవన్ కట్టగలిగినప్పుడు.. అమరవీరుల స్థూపం కట్టేందుకు 9 సంవత్సరాలు ఎందుకు పట్టిందని నిలదీశారు. సచివాలయ నిర్మాణంలోనూ అవినీతి జరిగిందన్న ఆయన.. వీటిపై విజిలెన్స్ విచారణ జరిపి, అందరినీ జైలుకు పంపుతామన్నారు.
Bihar: పట్టపగలే బీహార్లో కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
తాజావార్తలు
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!