Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్
Khammam student: తమ కన్నబిడ్డ ఉన్నత చదువులు చదివి తమను బాగా చూసుకుంటాడని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ వారి కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఎంఎస్ చేయడానికి వెళ్లిన కొడుకు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లాకు చెందిన మహంకాళి అఖిల సాయి సోమవారం రాత్రి బుల్లెట్ తగిలి మృతి చెందారు. తుపాకీ మిస్ ఫైర్ అయిందని మొదట చాలామంది అనుకున్నారు. అయితే తర్వాత స్నేహితుల హస్తం ఇందులో ఉందనే అనుమానం మొదలైంది. అయితే.. ఈవిషయం తెలుసుకున్న అఖిల్ సాయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమారుడు ఉన్నతంగా బతకాల్సిన వాడు ఉలుకూ పలుకూ లేకుండా పోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తనకుమారుడు అఖిల్ సాయి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో ప్రాణాలు విడిచిన అఖిల్ సాయిపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన ఆయన తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే అఖిల్ సాయి మృతదేహాన్ని తెలంగాణకు తెప్పించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
We will do our best to help the bereaved family @KTRoffice please contact and assist https://t.co/Zaz3CCxjZ7
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
— KTR (@KTRBRS) February 7, 2023
Read also: Harassment: మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య.. దానివల్లే అంటూ ఆరోపణ
ఏం జరిగిందంటే.. అమెరికాలోని అలబామా రాష్ట్రం ఆబర్న్ సిటీలో ఉంటున్న 25 ఏళ్ల మహాంకాళి అఖిల్ సాయి అనే యువకుడు బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన అఖిల్ సాయి తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన వాడు. కాగా.. ఏడాది క్రితమే అతడు ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లాడు. అఖిల్ అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. అక్కడ అలబామాలోని మోంట్ గోమెరీలో గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు. ఈనేపథ్యంలోనే సోమవారం రాత్రి డ్యూటీ చేస్తున్న టైంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే.. సెక్యూరిటీ గార్డు చేతిలో ఉన్న తుపాకీ తీసుకొని పరిశీలించబోయాడని ఆ గన్ మిస్ ఫైర్ అయిందని ప్రచారం జరిగింది. కాగా.. అఖిల్సాయి స్నేహితుడిని ఒకరిని అరెస్టు చేశారని ప్రచారం కూడా జరుగుతుండటం.. రవితేజ అనే స్నేహితుడే కాల్పులు జరిపాడని ప్రచారం నడుస్తోంది దీనిపై పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా.. కాల్పుల్లో బుల్లెట్ అఖిల్ సాయి శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే గ్యాస్ స్టేషన్ సిబ్బంది ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. అఖిల్ చికిత్స పొందుతూ అఖిల్ సాయి చనిపోయాడు. దీంతో అఖిల్ సాయి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
Horrible incident: రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. కారణం ఏంటంటే..
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!