Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam student: తమ కన్నబిడ్డ ఉన్నత చదువులు చదివి తమను బాగా చూసుకుంటాడని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ వారి కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఎంఎస్ చేయడానికి వెళ్లిన కొడుకు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లాకు చెందిన మహంకాళి అఖిల సాయి సోమవారం రాత్రి బుల్లెట్ తగిలి మృతి చెందారు. తుపాకీ మిస్ ఫైర్ అయిందని మొదట చాలామంది అనుకున్నారు. అయితే తర్వాత స్నేహితుల హస్తం ఇందులో ఉందనే అనుమానం మొదలైంది. అయితే.. ఈవిషయం తెలుసుకున్న అఖిల్ సాయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమారుడు ఉన్నతంగా బతకాల్సిన వాడు ఉలుకూ పలుకూ లేకుండా పోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తనకుమారుడు అఖిల్ సాయి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో ప్రాణాలు విడిచిన అఖిల్ సాయిపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన ఆయన తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే అఖిల్ సాయి మృతదేహాన్ని తెలంగాణకు తెప్పించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
We will do our best to help the bereaved family @KTRoffice please contact and assist https://t.co/Zaz3CCxjZ7
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
— KTR (@KTRBRS) February 7, 2023
Read also: Harassment: మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య.. దానివల్లే అంటూ ఆరోపణ
ఏం జరిగిందంటే.. అమెరికాలోని అలబామా రాష్ట్రం ఆబర్న్ సిటీలో ఉంటున్న 25 ఏళ్ల మహాంకాళి అఖిల్ సాయి అనే యువకుడు బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన అఖిల్ సాయి తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన వాడు. కాగా.. ఏడాది క్రితమే అతడు ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లాడు. అఖిల్ అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. అక్కడ అలబామాలోని మోంట్ గోమెరీలో గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు. ఈనేపథ్యంలోనే సోమవారం రాత్రి డ్యూటీ చేస్తున్న టైంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే.. సెక్యూరిటీ గార్డు చేతిలో ఉన్న తుపాకీ తీసుకొని పరిశీలించబోయాడని ఆ గన్ మిస్ ఫైర్ అయిందని ప్రచారం జరిగింది. కాగా.. అఖిల్సాయి స్నేహితుడిని ఒకరిని అరెస్టు చేశారని ప్రచారం కూడా జరుగుతుండటం.. రవితేజ అనే స్నేహితుడే కాల్పులు జరిపాడని ప్రచారం నడుస్తోంది దీనిపై పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా.. కాల్పుల్లో బుల్లెట్ అఖిల్ సాయి శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే గ్యాస్ స్టేషన్ సిబ్బంది ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. అఖిల్ చికిత్స పొందుతూ అఖిల్ సాయి చనిపోయాడు. దీంతో అఖిల్ సాయి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
Horrible incident: రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. కారణం ఏంటంటే..
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!