Red Alert at Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్.. విజిటర్స్ నో ఎంట్రీ
Red Alert at Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెడ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు.. జనవరి 31వ తేదీ వరకు ఎయిర్ పోర్ట్కు రెడ్ అలెర్ట్ ప్రకటించారు సెక్యూరిటీ ఆధికారులు, పోలీసులు.. ఈ నెల 31వ తేదీ వరకు సందర్శకులకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.. ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు.. ఎయిర్ పోర్ట్ కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు… అనుమానం వచ్చిన వాహనాలను అపి తనిఖీ చేస్తున్నారు సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఆధికారులు.. మొత్తంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా రిపబ్లిక్ డేకి ముందే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పటిష్ట బంధోబస్తు ఏర్పాటు చేశారు.. సందర్శకుల ప్రవేశం కూడా విమానాశ్రయం లోపల పరిమితం చేయబడింది. సందర్శకుల ప్రవేశం ఆగిపోతుందని మరియు వారికి పాస్లు జారీ చేయబడవు అని స్పష్టం చేశారు.. ప్రయాణీకులను జనవరి 31, 2022 వరకు వారితో అన్ని గుర్తింపు కార్డులను క్యారీ చేయాలని కోరారు.
Read Also: Health Tips: మీరు ఆరోగ్యవంతులేనా..? మీరే ఇలా చెక్చేసుకోండి..
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
మరోవైపు.. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఫూల్ప్రూఫ్ భద్రతను నిర్ధారించడానికి అమృత్సర్లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అమృత్సర్ విమానాశ్రయంలోని కార్ పార్కింగ్ సిటీ సైడ్ ప్యాసింజర్ హాల్లోని ప్రవేశ మరియు నిష్క్రమణ గేట్ల వద్ద భద్రతను పెంచారు. ప్రేక్షకుల గ్యాలరీలో ప్రవేశం, టిక్కెట్ ధర రూ. 75, జనవరి 30 వరకు మూసివేయబడింది. అమృత్సర్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం లోపల గురుద్వారా స్టాసార్ సాహిబ్కు వెళ్లే భక్తుల ప్రవేశం కూడా మూసివేయబడింది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఈసారి 2023లో రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.. ఇప్పటికే ఆయన భారత్కు చేరుకున్నారు.. షెడ్యూల్ ప్రకారం గణతంత్ర దినోత్సవ పరేడ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. రిపబ్లిక్ డే సమయంలో ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా అప్రమత్తం అయ్యింది నిఘా విభాగం.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!