ఇప్పటికే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షా లకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. తాజాగా వాతవారణ శాఖ తెలంగాణకు సైతం వర్షం ముప్పు ఉందని పేర్కొంది. తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కిందిస్థాయి నుంచి వీస్తున్న గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని, అలాగే బంగాళ ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఈనెల 15న ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ అల్ప పీడనం వాయుగుండంగా బల పడే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.