Etela Rajender: హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్దం.. ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ready for open discussion with Harish Rao- Etela Rajender: ఆర్థిక పరిస్థితి పై హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్దమని, ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా అని ఈటెల సవాల్ విసిరారు. ప్రజల డబ్బుతోనే ఓట్లు కొనే నీచ సంస్కృతికి కేసీఆర్ దిగజారాడని ఆరోపించారు. 2021 22 ఆర్థిక సంవత్సరం కి 36 వేల కోట్లు వడ్డీ కడుతుందని అన్నారు. బడ్జెట్ రూప కల్పనలు అన్ని తప్పులున్నాయని అన్నారు. నీతి అయోగ్ సిఫార్సులు మాత్రమే చేస్తుంది. కానీ నీతి అయోగ్ చెప్పిందని ఆ డబ్బులు వస్తాయని బడ్జెట్ లో పెట్టిందని, కేంద్రాన్ని బద్నాం చేయడం తప్ప ఇది మరొకటి కాదని ఈటెల మండిపడ్డారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేస్తేనే డబ్బులు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. Gsdp ప్రకారం ఎంత అప్పు వస్తుందో అంత కన్న ఎక్కువ బడ్జెట్ లో పెట్టిందని అన్నారు. GSDP లో తెలంగాణ అప్పు 27.2 శాతం అని, FRBM పరిమితికి మించి అప్పు చేశారని తెలిపారు. లిక్కర్ ద్వారా ఈ ప్రభుత్వంకి 45 వేల కోట్ల అంచనా అన్నారు ఈటెల రాజేందర్. తెలంగాణకు వచ్చే సొంత ఆదాయం లో లిక్కర్ ద్వారానే ఎక్కువ అని ఆరోపించారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లకు తెలంగాణ ప్రభుత్వం తన వాటాను సకాలంలో కట్టక పోవడంతో లాప్స్ అవుతున్నాయని మండిపడ్డారు.
Read also: Etela Rajender: కవితకు కౌంటర్.. CPI, CPM లు కేసీఆర్ వదిలిన బాణాలా?
Also Read
- Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్ను సింపుల్గా తెలుసుకోండిలా..
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- OTR : తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవికి లైన్ క్లియర్.. బరిలో బాలు నాయక్?
కేసీఆర్ వైఫల్యమే కారణం దీనికి కారణమని అన్నారు. ఇతర రాష్ట్రాలకు కేంద్రం సహకారం ఎలా ఉంటుందో తెలంగాణ కూడా అలానే చేస్తుందని ఈటెల అన్నారు. బట్ట కాల్చి మీద వేయడం కరెక్ట్ కాదని ఈటెల పేర్కొన్నారు. కేసీఆర్ డబ్బులు పంచే పని పెట్టుకున్నాడని, ఇదేమి గొప్ప కాదని సంక్షేమం ఉండాలని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు. కవిత చేసిన ట్వీట్ కు ఎమ్మల్యే ఈటెల స్పందించారు. షర్మిల తానా అంటే తందానా అని బీజేపీ నేతలు పరోక్షంగా ఆక్షేపించారు. వారు వదిలిన బాణం తానా అంటే తామర పువ్వులు అని ట్వీట్ చేసిన కవిత పై ఈటెల మండిపడ్డారు. షర్మిల బీజేపీ వదిలిన బాణమా? కాదా? అనేది పక్కన పెడితే ఆమెది ఒక పార్టీ అని అన్నారు. కవితకు ఇచ్చిన ట్వీట్కు CPI, CPM లు కేసీఆర్ వదిలిన బాణాలా? అంటూ ప్రశ్నించారు ఈటెల. ప్రజా స్వామ్యం లో నిరసనలు అన్ని పార్టీలు చేస్తాయని, ప్రభుత్వం అధ్వాన్నం గా దుర్మార్గం గా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇది ఎవరు చేసిన ఖండించల్సిందే అని స్పష్టం చేశారు. ప్రభుత్వం పోలీస్ లను అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పోలీస్ లను నమ్ముకున్న ఎవరు ముందు పడరని అన్నారు.
Vikram Kirloskar: భారత్కు టయోటా తెచ్చిన విక్రమ్ కిర్లోస్కర్ హఠాన్మరణం
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!