Rajagopal Reddy: నేడు న్యూఢిల్లీకి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajagopal Reddy: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోన్ చేసింది. ఢిల్లీకి రావాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కూడా ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. కాగా.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు కాంగ్రెస్లో చేరనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి టికెట్పై కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కోమటిరెడ్డి ఫోన్ చేశారు. ఈరోజు ఢిల్లీకి రావాలని కోరారు. అది కుదిరితే ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. కుదరని పక్షంలో రేపు కాంగ్రెస్లో చేరనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు కోసం ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. నిన్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కూడా జరిగింది. నిన్నటి సమావేశంలో 40 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. వామపక్షాలతో పొత్తు, ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నేతలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15న తొలి జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. కానీ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉండడంతో అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ పార్టీ ఫిదా అవుతోంది. మరోవైపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ సీనియర్లను బరిలోకి దించాలని ఆ పార్టీ భావిస్తోంది. మునుగోడుతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఈ విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పార్టీ అధిష్టానం చర్చించనుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ను కూడా న్యూఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం కోరింది.
They Call Him OG: పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ సంభవం లోడింగ్…
Also Read
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?