Raja Singh: భాగ్యలక్ష్మీ ఆలయంపై చేయివేస్తే నరికేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కొత్తగా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం, చార్మినార్ వివాదం నడుస్తోంది. స్థానిక కాంగ్రెస్ లీడర్ రషీద్ ఖాన్ చార్మినార్ వద్ద నమాజ్ చేసుకోవడానికి అనుమతి కావాలంటూ సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రారంభించడం వివాదానికి కారణం అయింది. భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు జరుగుతున్నప్పుడు.. నమాజ్ కు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇది న్యాయపరమైన డిమాండ్ అని.. దీని కోసం సీఎం కేసీఆర్ ను కలుస్తా అని అన్నారు.
దీంతో బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ భాగ్యలక్ష్మీ ఆలయం మాకు ఎంతో ముఖ్యమని.. కొంతమంది కూల్చేయాలని, చేయివేయాలని చూస్తున్నారని ఖబద్దార్ అంటూ హెచ్చరించారు. చార్మినార్ కూల్చేయాలంటూ మేం ఎప్పుడూ డిమాండ్ చేయాలేదని.. ఓల్డ్ సిటీలోని ముస్లింలు డెవలప్ కావాలని కోరుకుంటున్నామని సంజయ్ అన్నారు. ఎంఐఎం పార్టీ ఆస్తులు కూడ బెట్టుకుంటున్నారని..ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారంటూ విమర్శించారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వివాదంపై స్పందించారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీద్ వద్ద మేము సంతకాలు తీసుకోవాలా.? అని ప్రశ్నించారు. ఇలా చేస్తే వాతావరణం దెబ్బతింటుందని అన్నారు. రషీద్ ఖాన్ మీద సుమోటగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చార్మినార్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని.. అటు నుంచి పెద్ద వాహనాలు వెళ్తే కూలిపోయే స్థితిలో ఉందని అన్నారు. రషీద్ ఖాన్ కు ఏమైనా సిగ్గుందా అని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ను ముట్టుకుంటే చెయ్యి నరికేస్తా అని హెచ్చరించారు. రషిద్ ఖాన్ మసీద్ కు వెళ్లి ప్రార్థన చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
.
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!