Raja Singh: భాగ్యలక్ష్మీ ఆలయంపై చేయివేస్తే నరికేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కొత్తగా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం, చార్మినార్ వివాదం నడుస్తోంది. స్థానిక కాంగ్రెస్ లీడర్ రషీద్ ఖాన్ చార్మినార్ వద్ద నమాజ్ చేసుకోవడానికి అనుమతి కావాలంటూ సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రారంభించడం వివాదానికి కారణం అయింది. భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు జరుగుతున్నప్పుడు.. నమాజ్ కు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇది న్యాయపరమైన డిమాండ్ అని.. దీని కోసం సీఎం కేసీఆర్ ను కలుస్తా అని అన్నారు.
దీంతో బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ భాగ్యలక్ష్మీ ఆలయం మాకు ఎంతో ముఖ్యమని.. కొంతమంది కూల్చేయాలని, చేయివేయాలని చూస్తున్నారని ఖబద్దార్ అంటూ హెచ్చరించారు. చార్మినార్ కూల్చేయాలంటూ మేం ఎప్పుడూ డిమాండ్ చేయాలేదని.. ఓల్డ్ సిటీలోని ముస్లింలు డెవలప్ కావాలని కోరుకుంటున్నామని సంజయ్ అన్నారు. ఎంఐఎం పార్టీ ఆస్తులు కూడ బెట్టుకుంటున్నారని..ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారంటూ విమర్శించారు.
Also Read
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వివాదంపై స్పందించారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీద్ వద్ద మేము సంతకాలు తీసుకోవాలా.? అని ప్రశ్నించారు. ఇలా చేస్తే వాతావరణం దెబ్బతింటుందని అన్నారు. రషీద్ ఖాన్ మీద సుమోటగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చార్మినార్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని.. అటు నుంచి పెద్ద వాహనాలు వెళ్తే కూలిపోయే స్థితిలో ఉందని అన్నారు. రషీద్ ఖాన్ కు ఏమైనా సిగ్గుందా అని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ను ముట్టుకుంటే చెయ్యి నరికేస్తా అని హెచ్చరించారు. రషిద్ ఖాన్ మసీద్ కు వెళ్లి ప్రార్థన చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
.
తాజావార్తలు
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?