MLC Kavitha : ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురింపించిన ఎమ్మెల్సీ కవిత
- రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
- ఆరు గ్యారంటీల విఫలం.. ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్
- రేవంత్ రెడ్డి పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనలపై రాహుల్ మౌనంగా ఎందుకు : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. “ఎన్నికల సమయంలోనే కనిపించే గాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. ఆయనను స్వాగతించాల్సిందే… ఎందుకంటే మళ్లీ కనిపించేది ఎన్నికలపూటే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కవిత తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితంగా నిలిచాయని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఏ ఒక్క హామీను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పిన వాగ్దానం కేవలం అర్థాంతరంగా నిలిచిందని, మహిళలకు తులం బంగారం, నెలకు రూ.2500 ఇస్తామన్న హామీలు కనిపించకుండా పోయాయని కవిత ఆరోపించారు.
అంతేకాదు, రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఇటీవల హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన లాఠీ దాడులను, లగచర్లలో బంజారా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను గుర్తుచేస్తూ, ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన వైఫల్యాలకు నిదర్శనాలని ఆమె పేర్కొన్నారు. ఈ దాడులన్నింటిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించిందని గుర్తు చేశారు. సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో “కరెంట్ లేదు” అని పోస్ట్ చేస్తే వారిపై కేసులు పెడుతున్న పరిస్థితిలో, తెలంగాణ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారని కవిత తెలిపారు. గ్రూప్-1 పరీక్షల ఆలస్యంపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నా, కాంగ్రెస్ నాయకత్వం మౌనంగా ఉండటం దారుణమని విమర్శించారు.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
“రాహుల్ గాంధీ ఎర్ర బుక్ పట్టుకుని దేశమంతా తిరుగుతారు, కానీ తెలంగాణలో రాజ్యాంగ విలువలు తుడిచిపెట్టే చర్యలపై మాత్రం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచేలా ఉంది,” అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి తీవ్రంగా సవాల్ విసిరిన కవిత, తెలంగాణ ప్రజలు నిజాన్ని తెలుసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చబోతున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!