Rahul Gandhi: అంబటి పల్లిలో మహిళా సదస్సు.. పొల్గొన్న రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగిపోయిన పిల్లర్లను రాహుల్ గాంధీ పరిశీలించనున్నారు. అంబటి పల్లి మహిళా సదస్సులో రాహుల్ పాల్గొన్నారు. సభ పూర్తి కాగానే మెడిగడ్డకు రాహుల్ బయలు దేరనున్నారు. కల్వకుర్తిలో నిన్న జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ లక్షల ఎకరాలకు నీరందిస్తున్నాయని, అయితే టీఆర్ ఎస్ ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయని విమర్శించారు. ప్రియదర్శిని జూరాల, శ్రీరామ్ సాగర్. నాగార్జునసాగర్, సింగూరు ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టంగా ఉన్నాయని, లక్షల ఎకరాలకు నీరు అందించి సాగులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న ప్రజలకు ఆదాయం, పని లభిస్తున్నదని గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి మరీ ప్రాజెక్టులు నిర్మించిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతి బ్యారేజీ కూలిపోతుందని, దానిపై సమీక్ష నిర్వహించాలని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే ఇప్పటి వరకు దానిపై సమీక్ష నిర్వహించలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్కు బై బై చెబుతాం.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో పాటు అవినీతి మంత్రులకు మా ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లోకి చేర్చేలా చూస్తాం’’ అని రాహుల్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎక్సైజ్, భూ రెవెన్యూ, ఇసుక తవ్వకాల వంటి ఆదాయాన్ని సమకూర్చే శాఖలపై సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం గుత్తాధిపత్యం సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల నుంచి లక్షల కోట్లు దోచి అనతికాలంలోనే శిథిలావస్థకు చేరుకున్న ప్రాజెక్టును నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల సొమ్ముతో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసే ప్రాజెక్టుగా మార్చారని, 2040 వరకు తెలంగాణలోని ప్రతి కుటుంబం ఏటా రూ.31,500ల భారం పడేలా చేశారని విమర్శించారు.
IT Raids: హైదరాబాద్ లో ఐటీ రైడ్స్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఇళ్లలో తనిఖీలు
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Tags
- BRS
- congress
- kcr
- ktr
- rahul gandhi
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!