R.Krishnaiah : కవితకు బీసీలు ముందుకు వచ్చి అండగా ఉండాలి
- బీసీల కోసం కవిత పోరాటం
- జూలై 17 రైల్ రోకోకు మద్దతు
- 42% రిజర్వేషన్ కోసం పోరాడాలి: ఆర్. కృష్ణయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R.Krishnaiah : తెలంగాణలో బీసీల హక్కుల కోసం నడుస్తున్న ఉద్యమానికి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చర్యలు ముమ్మరం చేశారు. బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆమె హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి, జూలై 17 జరగనున్న జాగృతి రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ జాగృతి తరఫున మేము బీసీల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఆర్.కృష్ణయ్య గారిని కలిసాము. కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలన్న డిమాండ్తో మేము ఉద్యమం చేపట్టాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే బిల్లులు పాస్ చేసి, రాష్ట్రపతికి పంపించామని చెప్పి చేతులు దులుపుకుంటోంది,” అని విమర్శించారు.
అంతేకాకుండా.. రేపు జరగనున్న క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం లేకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని స్పష్టం చేశారు. ‘ఔర్ ఎక్ దక్కా.. బీసీ బిల్లు పక్కా’ అనే నినాదంతో నిర్వహించనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కృష్ణయ్యను కోరినట్లు తెలిపారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
SSMB 29 : మహేశ్ ఎంట్రీ సీక్వెన్స్ పై రాజమౌళి గ్రాండ్ ప్లాన్!
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి లేదని, బిల్లులు పాస్ చేశారన్న మాటలు చెబుతున్నారు కానీ అమలు చేసే ప్రయత్నం లేదు అని పేర్కొన్నారు.
అంతేకాక.. కవిత బీసీ కాకపోయినా, బీసీల కోసం పోరాటం చేస్తున్నారన్నారు. ఇది గమనించదగ్గ విషయమని, బీసీలు ఇప్పుడు మౌనం వహిస్తే, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను కూడా కోల్పోవాల్సి వస్తుందన్నారు. 75 ఏళ్లుగా బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనాల్సిన సమయం ఇది అని, ఉద్యమం చేయకపోతే హక్కులు రాదని గుర్తించాలి అని ప్రజలకు సూచించారు.
జూలై 17న జరగనున్న జాగృతి రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య స్పష్టంగా తెలిపారు. బీసీల హక్కుల కోసం ఎవరు పోరాటం చేసినా, అందరికీ మద్దతు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు ఆర్.కృష్ణయ్య. లేకపోతే ప్రజల మద్దతుతో పెద్ద స్థాయిలో ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశం బీసీ ఉద్యమానికి మరింత ఉత్సాహాన్నిస్తుందన్నది స్పష్టంగా కనిపిస్తోందని, పార్టీ పరమైన విభేదాలను పక్కన పెట్టి, హక్కుల కోసం ఒకే తాటిపైకి వచ్చే ప్రయత్నానికి ఇది నిదర్శనమన్నారు.
Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!