R.Krishnaiah : కవితకు బీసీలు ముందుకు వచ్చి అండగా ఉండాలి
- బీసీల కోసం కవిత పోరాటం
- జూలై 17 రైల్ రోకోకు మద్దతు
- 42% రిజర్వేషన్ కోసం పోరాడాలి: ఆర్. కృష్ణయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R.Krishnaiah : తెలంగాణలో బీసీల హక్కుల కోసం నడుస్తున్న ఉద్యమానికి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చర్యలు ముమ్మరం చేశారు. బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆమె హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి, జూలై 17 జరగనున్న జాగృతి రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ జాగృతి తరఫున మేము బీసీల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఆర్.కృష్ణయ్య గారిని కలిసాము. కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలన్న డిమాండ్తో మేము ఉద్యమం చేపట్టాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే బిల్లులు పాస్ చేసి, రాష్ట్రపతికి పంపించామని చెప్పి చేతులు దులుపుకుంటోంది,” అని విమర్శించారు.
అంతేకాకుండా.. రేపు జరగనున్న క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం లేకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని స్పష్టం చేశారు. ‘ఔర్ ఎక్ దక్కా.. బీసీ బిల్లు పక్కా’ అనే నినాదంతో నిర్వహించనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కృష్ణయ్యను కోరినట్లు తెలిపారు.
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
SSMB 29 : మహేశ్ ఎంట్రీ సీక్వెన్స్ పై రాజమౌళి గ్రాండ్ ప్లాన్!
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి లేదని, బిల్లులు పాస్ చేశారన్న మాటలు చెబుతున్నారు కానీ అమలు చేసే ప్రయత్నం లేదు అని పేర్కొన్నారు.
అంతేకాక.. కవిత బీసీ కాకపోయినా, బీసీల కోసం పోరాటం చేస్తున్నారన్నారు. ఇది గమనించదగ్గ విషయమని, బీసీలు ఇప్పుడు మౌనం వహిస్తే, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను కూడా కోల్పోవాల్సి వస్తుందన్నారు. 75 ఏళ్లుగా బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనాల్సిన సమయం ఇది అని, ఉద్యమం చేయకపోతే హక్కులు రాదని గుర్తించాలి అని ప్రజలకు సూచించారు.
జూలై 17న జరగనున్న జాగృతి రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య స్పష్టంగా తెలిపారు. బీసీల హక్కుల కోసం ఎవరు పోరాటం చేసినా, అందరికీ మద్దతు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు ఆర్.కృష్ణయ్య. లేకపోతే ప్రజల మద్దతుతో పెద్ద స్థాయిలో ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశం బీసీ ఉద్యమానికి మరింత ఉత్సాహాన్నిస్తుందన్నది స్పష్టంగా కనిపిస్తోందని, పార్టీ పరమైన విభేదాలను పక్కన పెట్టి, హక్కుల కోసం ఒకే తాటిపైకి వచ్చే ప్రయత్నానికి ఇది నిదర్శనమన్నారు.
Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే..
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!