Prajavani: ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ.. వేకువజాము నుంచే క్యూ కట్టిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajavani: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజా సమస్యలను వినేందుకు ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 10గంటల లోపు వచ్చినవారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎలాగైనా 10గంటల లోపు క్యూలో నిలబడాలని అర్థరాత్రి బయలుదేరుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, భూసమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తేనే తమ సమస్య పరిష్కారమవుతుందని అందుకే వచ్చామని చెబుతున్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ప్రజావాణి ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. నగరవాసులే కాకుండా అనేక జిల్లాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజావాణికి వస్తున్నారు. అక్కిడికి వచ్చిన వారిని సరైన దారిలో పంపించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా రద్దీ లేని మార్గం నుంచి పంపిస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే వారికి మౌలిక వసతులపై మరింత శ్రద్ధ చూపాలని పిటిషనర్లు కోరుతున్నారు. జిల్లాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డుపైనే నిద్రిస్తున్నారని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడి తమ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read also: Singareni Elections: రేపే సింగరేణి ఎన్నికలు.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలు ఇప్పట్లో పరిష్కారమవుతాయనే ఉద్దేశంతో చలిని సైతం లెక్కచేయకుండా బాధితులు వస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ప్రజాభవన్ వద్ద బారులు తీరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి మంగళ, శుక్రవారాల్లోనే జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఓ బాధితుడు మాట్లాడుతూ… హైదరాబాద్ నుంచి వచ్చానని.. 2019లో సాహిత్య నిర్మాణానికి డబ్బు చెల్లించానని తెలిపాడు. ఇలా మేమందరం చాలా మంది బాధితులు ఉన్నారని తెలిపారు. ఆ కంపెనీ యజమాని డబ్బులు తీసుకుని పారిపోయాడని వాపోయాదు. పోలీసులకు సమాచారం అందించామని కానీ ఎటువంటి ప్రయోజనం లేదని అన్నాడు. మేము రెరాలో ఫిర్యాదు చేసామని అన్నారు. గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, కానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా అయినా మా సమస్యలు తీరుతాయని ఇక్కడికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా అయినా మా సమస్యలు తీరుతాయనే నమ్మకం ఉందని అన్నారు.
Singareni Elections: రేపే సింగరేణి ఎన్నికలు.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!