Prajavani: ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ.. వేకువజాము నుంచే క్యూ కట్టిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajavani: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజా సమస్యలను వినేందుకు ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 10గంటల లోపు వచ్చినవారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎలాగైనా 10గంటల లోపు క్యూలో నిలబడాలని అర్థరాత్రి బయలుదేరుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, భూసమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తేనే తమ సమస్య పరిష్కారమవుతుందని అందుకే వచ్చామని చెబుతున్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ప్రజావాణి ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. నగరవాసులే కాకుండా అనేక జిల్లాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజావాణికి వస్తున్నారు. అక్కిడికి వచ్చిన వారిని సరైన దారిలో పంపించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా రద్దీ లేని మార్గం నుంచి పంపిస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే వారికి మౌలిక వసతులపై మరింత శ్రద్ధ చూపాలని పిటిషనర్లు కోరుతున్నారు. జిల్లాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డుపైనే నిద్రిస్తున్నారని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడి తమ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read also: Singareni Elections: రేపే సింగరేణి ఎన్నికలు.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
Also Read
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలు ఇప్పట్లో పరిష్కారమవుతాయనే ఉద్దేశంతో చలిని సైతం లెక్కచేయకుండా బాధితులు వస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ప్రజాభవన్ వద్ద బారులు తీరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి మంగళ, శుక్రవారాల్లోనే జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఓ బాధితుడు మాట్లాడుతూ… హైదరాబాద్ నుంచి వచ్చానని.. 2019లో సాహిత్య నిర్మాణానికి డబ్బు చెల్లించానని తెలిపాడు. ఇలా మేమందరం చాలా మంది బాధితులు ఉన్నారని తెలిపారు. ఆ కంపెనీ యజమాని డబ్బులు తీసుకుని పారిపోయాడని వాపోయాదు. పోలీసులకు సమాచారం అందించామని కానీ ఎటువంటి ప్రయోజనం లేదని అన్నాడు. మేము రెరాలో ఫిర్యాదు చేసామని అన్నారు. గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, కానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా అయినా మా సమస్యలు తీరుతాయని ఇక్కడికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా అయినా మా సమస్యలు తీరుతాయనే నమ్మకం ఉందని అన్నారు.
Singareni Elections: రేపే సింగరేణి ఎన్నికలు.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!