Singareni Elections: రేపే సింగరేణి ఎన్నికలు.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni Elections: రేపటి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు రేపు 11 ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రేపు (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ షురూ కానుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు నిర్వహించనున్నారు. రామగుండం ఏరియాలో మూడు డివిజన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎన్నికల అధికారులుగా డివిజన్ ఒక ఆర్డీఓను కలెక్టర్ నియమించారు. రామగుండం ఏరియాలోని RG-1, RG-2, RG-3 డివిజన్లలో మొత్తం 23 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు అధికారులు.
Read also: Governor Tamilisai: నేడు ఢిల్లీకి గవర్నర్ తమిళిసై.. లోక్సభ ఎన్నికల్లో పోటీపై షాతో చర్చ..!
Also Read
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Off The Record : సొంత ప్రభుత్వమైనా తగ్గేదే లే.. దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు!
RG-1లో 11 పోలింగ్ కేంద్రాలు, RG-2లో ఆరు, RG-3లో ఆరు మొత్తం 23 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్దం చేసారు. మూడు కేంద్రాల్లో కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు. రామగుండం ఏరియాలోని RG-1లో 5404, RG-2లో 3557, RG-3లో 3884 ఓటర్లు కాగా.. మొత్తం 12 వేల 8 వందల 45 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని 13 కార్మిక సంఘాలు పరీక్షించుకోనున్నారు. కాగా.. ఇప్పటికే పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని నియమించి శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. కాగా, సోమవారం సంస్థ వ్యాప్తంగా ఆయా డివిజన్ల అధికారులు పోలింగ్ బూత్లను పరిశీలించారు. పోలింగ్ రోజున ప్రతి ఉద్యోగి తమ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు చూపించనిదే లోనికి అనుమతించమని క్లారిటీ ఇచ్చారు. కావున వచ్చేవారు తప్పకుండా గుర్తింపుకార్డు తప్పని సరిగా తెలిపారు.
తెలంగాణలో కొత్త ఆరు జిల్లాలు 11 ఏరియాల్లో సింగరేణి విస్తరించింది. కాగా.. మొత్తం 39 వేల 809 మంది ఓటర్లు ఉన్నారు. సింగరేణి ఎన్నికల్లో ఏరియాల వారీగా కార్మికులు..
* కార్పోరేట్ లో 1,191 మంది,
* కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది,
* ఇల్లెందులో 613 మంది,
* మణుగూరులో 2,452,
* రామగుండం-1 లో 5,404,
* రామగుండం-2 లో 3,557,
* రామగుండం-3 లో 3,884,
* భూపాలపల్లిలో 5,395 మంది
* బెల్లంపల్లి లో 998
* మందమర్రిలో 4,838,
* శ్రీరాంపూర్ లో 9,149,
Vangaveeti Ranga Death Anniversary: వంగవీటి రంగా వర్ధంతి వేడుకలకు దూరంగా రాధా!
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?