Singareni Elections: రేపే సింగరేణి ఎన్నికలు.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni Elections: రేపటి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు రేపు 11 ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రేపు (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ షురూ కానుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు నిర్వహించనున్నారు. రామగుండం ఏరియాలో మూడు డివిజన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎన్నికల అధికారులుగా డివిజన్ ఒక ఆర్డీఓను కలెక్టర్ నియమించారు. రామగుండం ఏరియాలోని RG-1, RG-2, RG-3 డివిజన్లలో మొత్తం 23 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు అధికారులు.
Read also: Governor Tamilisai: నేడు ఢిల్లీకి గవర్నర్ తమిళిసై.. లోక్సభ ఎన్నికల్లో పోటీపై షాతో చర్చ..!
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
RG-1లో 11 పోలింగ్ కేంద్రాలు, RG-2లో ఆరు, RG-3లో ఆరు మొత్తం 23 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్దం చేసారు. మూడు కేంద్రాల్లో కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు. రామగుండం ఏరియాలోని RG-1లో 5404, RG-2లో 3557, RG-3లో 3884 ఓటర్లు కాగా.. మొత్తం 12 వేల 8 వందల 45 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని 13 కార్మిక సంఘాలు పరీక్షించుకోనున్నారు. కాగా.. ఇప్పటికే పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని నియమించి శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. కాగా, సోమవారం సంస్థ వ్యాప్తంగా ఆయా డివిజన్ల అధికారులు పోలింగ్ బూత్లను పరిశీలించారు. పోలింగ్ రోజున ప్రతి ఉద్యోగి తమ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు చూపించనిదే లోనికి అనుమతించమని క్లారిటీ ఇచ్చారు. కావున వచ్చేవారు తప్పకుండా గుర్తింపుకార్డు తప్పని సరిగా తెలిపారు.
తెలంగాణలో కొత్త ఆరు జిల్లాలు 11 ఏరియాల్లో సింగరేణి విస్తరించింది. కాగా.. మొత్తం 39 వేల 809 మంది ఓటర్లు ఉన్నారు. సింగరేణి ఎన్నికల్లో ఏరియాల వారీగా కార్మికులు..
* కార్పోరేట్ లో 1,191 మంది,
* కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది,
* ఇల్లెందులో 613 మంది,
* మణుగూరులో 2,452,
* రామగుండం-1 లో 5,404,
* రామగుండం-2 లో 3,557,
* రామగుండం-3 లో 3,884,
* భూపాలపల్లిలో 5,395 మంది
* బెల్లంపల్లి లో 998
* మందమర్రిలో 4,838,
* శ్రీరాంపూర్ లో 9,149,
Vangaveeti Ranga Death Anniversary: వంగవీటి రంగా వర్ధంతి వేడుకలకు దూరంగా రాధా!
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!