Ponnam Prabhakar: బీజేపీ కి 400 సీట్లు వస్తే బీసీలు ఆగమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: బీజేపీ కి 400 సీట్లు వస్తే బీసీలు ఆగమే.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్ లో కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్య హాజరయ్యారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గొల్ల కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఐతే కురుమ కార్పొరేషన్ వేరుగా ఏర్పాటు చేయాలనీ బీర్ల ఐలయ్య కోరారని తెలిపారు.
Read also: Jairam Ramesh: మోడీ ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
దానికి సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఐపోగానే ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ, బీసీలకు వ్యతిరేక పార్టీ.. రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తుందన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే.. బీసీలు ఆగమే అన్నారు. అందుకే ఉత్తర భారత దేశం గ్రహించి బిజెపికి వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. పాంచ్ న్యాయ్ అని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. బీజేపీ రాముణ్ణి నమ్ముకొని రాజకీయం చేస్తుందన్నారు. బీజేపీ రిజర్వేషన్ లను టచ్ చేస్తే.. తొక్కలు తీస్తామన్నారు. బీజేపీ నేతలు నిన్నటి నుండి రిజర్వేషన్లు తీయం అంటున్నారని తెలిపారు.
Read also: Kalpana Soren: గాండే అసెంబ్లీ ఉప ఎన్నికకు కల్పనా సోరెన్ నామినేషన్
కురుమ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ పెద్దపీట వేసిందన్నారు. కురుమలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది కాంగ్రెసే అని తెలిపారు. Nsui లో నాతో పాటు స్టేట్ బాడీ లో కురుమ యువకులు వున్నారని తెలిపారు. యాదవ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ సభ్యుడిగా పంపిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు కురుమలకు రావాలని కోరుకుంటున్నా అని తెలిపారు.
Read also: PM Modi: అమిత్ షా ఫేక్ వీడియోలు వైరల్.. ప్రధాని మోడీ సీరియస్..!
కురుమ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. కొల్లూరు మల్లప్ప ఫొటోను గాంధీ భవన్లో పెట్టడం సంతోషమన్నారు. HPCC గా కొల్లూరు మల్లప్ప పనిచేశారన్నారు. కేసీఆర్, మోడీ గొల్లకురుమలను మోసం చేసిందన్నారు. గోర్లు బర్లు అని కేసీఆర్ మోసం చేసిండని తెలిపారు. 17 సీట్లల్లో కాంగ్రెస్ గెలుపు కోసం గొల్లకురుమలు పనిచేయాలన్నారు. మోడీ బీసీఅని చెప్పుకుంటడు.. కానీ రిజర్వేషన్లను ఎత్తేస్తా అంటుండు అని మండిపడ్డారు. కాంగ్రెస్ గొల్లకురుమలకు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు ఇచ్చిందన్నారు. మోడీ కేడీ ఇద్దరు ఒక్కటై బీసీలను మోసం చేస్తున్నారని తెలిపారు. మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. గుడిలో దేవుడు ఉండాలి, భక్తి మనసులో ఉండాలన్నారు. మతాలు,కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుండు మోడీ అని తెలిపారు. మరోసారి మోడీ వస్తే.. దేశప్రజలు ఆగమే అన్నారు. సరితకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సముచిత స్తానం ఇస్తారన్నారు.
Read also: Heat wave Warning: తెలుగు రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నారు. కానీ అనివార్యకారణాల వల్ల రాలేకపోయాయని తెలిపారు. బీసీలో కురుమ సంఖ్య పెద్దదే అన్నారు. కురుమలకు రాజకీయ అవకాశాలు రావాలన్నారు. గద్వాలలో సరితకు అవకాశం ఇచ్చింది పార్టీ.. కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల ఓటమిపాలయ్యిందన్నారు. సరితా గెలిస్తే కురుమలకు మరింత బలం అయ్యేదన్నారు. బీర్ల ఐలయ్య గెలిచి కురుమలకు ప్రతినిధిగా నిలిచిండన్నారు. కార్పొరేషన్ పదవులు కూడా రావాలి కురుమలకు అని తెలిపారు. కురుమ కులానికో చెందిన కొల్లూరు మల్లప్ప.. మొట్టమొదటి హైదరాబాద్ స్టేట్ కు పీసీసీ చీఫ్ గా పనిచేశారన్నారు. ఐలయ్య ఆధ్వర్యంలో సీఎంను కలిసి కురుమలకు పార్టీలు ప్రభుత్వంలో మరిన్ని అవకాశాలు వచ్చేలా చూస్తామన్నారు.
Tamannaah Bhatia : సారీ రాలేను.. నాకు టైం కావాలి.. సైబర్ సెల్ ను కోరిన తమన్నా
తాజావార్తలు
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!