Ponnam Prabhakar: అనాడు రాజీవ్ గాంధీ యే రాముడి చరిత్ర వెలికి తీశారని రవాణా, బీసీ సంక్షేమం మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రాజన్న ఆలయంలోకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. రాజన్నకు కోడె మొక్కు సమర్పించుకొని మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇవాళ బోగి సందర్భంగా తెలంగాణ ప్రజలకు బోగి ,మకర ,సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడాలి, రైతులు బాగుండాలని కోరారు. దేవుడిని కూడ ఈదేశంలో రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. హిందూ సంస్కృతి ఉన్న వారు దేశాన్నీ గౌరవిస్తారు, దేవుడు కొందరికే స్వంతం అని వ్యవహరిస్తున్నారని తెలిపారు. దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతి లింగాలు, నాలుగు వేదాలు, నలుగురు జగద్గురులు ఉన్న దేశంలో వాళ్ళ చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా.. రాజకీయాల కోసం దేవుడిని ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. పవిత్ర భారత దేశంలో రాజకీయాలను కూడ మార్కెటింగ్ చేస్తున్నారు, తాము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతి రేఖం అంటున్నారని తెలిపారు.
Read also: Ram Mandir : 74శాతం ముస్లింలు రామ మందిర నిర్మాణం పట్ల సంతోషంగా ఉన్నారు.. సర్వే నివేదిక
హిందుత్వాన్ని విశ్వసించే వారు ఆలోచన చేయాలని తెలిపారు. దేవాలయంను పూర్తి కాలేదు అని జగద్గురువులు చెబుతున్నారని అన్నారు. దేవుడు కొందరి వాడు కాదు.. అందరి వాడు అన్నారు. రాముడు, శివుడు హన్మంతుడు మాకు లేడా అంటే మా పై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతున్న మీరు ఇంకా రాజకీయం చేస్తున్నారు, పార్లమెంట్ లో ఆదాని అంబానీ, గురించి ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడం లేదని అన్నారు. శివరాత్రి కంటే ముందు రాజన్న ఆలయ అభివృద్ధిపై వీటిడీ ఏ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ గాంధీ యే రాముడి చరిత్రను అప్పట్లో వెలికి తీశారని గుర్తుచేశారు.
Devil: ఓటీటీలోకి బ్రిటిష్ ఏజెంట్ వచ్చేసాడు…