Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
- పదేళ్ల పాలనకు లెక్కలు చెప్పాలి
- బీఆర్ఎస్కు నిరసన చేసే హక్కు లేదు
- సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రజాపాలన లక్ష్యం
- ప్రజలే బీఆర్ఎస్కు బుద్ధి చెబుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చాపగాని తండాలో నిర్వహించిన కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న వేళ బీఆర్ఎస్ చేపడుతున్న నిరసనలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పదేళ్ల అప్పుల పాలనకు లెక్కలు చెప్పాలి.. నిరసనలకు నైతిక హక్కు లేదు
పది సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణను తీవ్ర అప్పులమయం చేసిన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపే నైతిక హక్కు లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారో ప్రజలే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుంటే, గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడికి పోయాయో ప్రజలు వారిని ప్రశ్నించాలని కోరారు. పదేళ్ల పాలనకు లెక్కలు చెప్పకుండా కాంగ్రెస్పై విమర్శలు చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ధ్వజమెత్తారు.
Also Read
- Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం.. ప్రజాపాలనే లక్ష్యం
కాంగ్రెస్ ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు అందిస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులపై యజమానులుగా గౌరవాన్ని తెచ్చామని, ఇప్పటివరకు 72 వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా ఇచ్చామని వివరించారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సాధించిన 1000 రోజుల సంక్షేమ విజయాలను చూసి ఓర్వలేకే, భయంతో బీఆర్ఎస్ ఈ నిరసనలు చేస్తోందని, ప్రజలే వారికి తగిన సమాధానం చెబుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!