AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
- ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి AAS
- SGPతో ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం
- 1.30 లక్షల మందికి నేరుగా లబ్ధి
- సర్వీస్ రికార్డుల పరిశీలనకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAS SGP : ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆరేళ్ల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసుకున్న సిబ్బందికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (AAS) కింద స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్ (SGP) మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది.
1.30 లక్షల మంది ఉద్యోగులకు నేరుగా లబ్ధి
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000కు పైగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో విధినిర్వహణలో ఉన్న సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా 2019, 2020 సంవత్సరాల్లో తొలి విడత రిక్రూట్మెంట్లో ఎంపికై బాధ్యతలు స్వీకరించిన సిబ్బందికి ఈ స్కేల్ వర్తిస్తుంది. 11వ వేతన సవరణ కమిషన్ (PRC) చేసిన సూచనలకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ ఆర్థిక లబ్ధిని అమల్లోకి తెచ్చింది.
Also Read
- CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
హోదా పెంపు కాదు.. కేవలం ఆర్థిక భరోసా మాత్రమే
కాగా, ఇది రెగ్యులర్ ప్రమోషన్ కాదని, సుదీర్ఘకాలంగా ఒకే పోస్టులో సేవలు అందిస్తున్న ఉద్యోగులకు లభించే ఆర్థిక ఊరట మాత్రమేనని అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లో భాగమైన ఈ వ్యవస్థ ద్వారా 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి స్పెషల్ గ్రేడ్ అందిస్తుండగా, ఆ తర్వాత వరుసగా 12, 18, , 24 ఏళ్ల సర్వీసును అధిగమించిన కొద్దీ తదుపరి స్థాయి ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయని వివరించారు.
రికార్డుల పరిశీలనకు ఆదేశాలు.. సర్వత్రా హర్షాతిరేకాలు
తాజా జీవో నేపథ్యంలో, సచివాలయాల్లో అర్హులైన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను తక్షణమే క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎలాంటి ఆలస్యం లేకుండా స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్ను వర్తింపజేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చే ఈ నిర్ణయం పట్ల సచివాలయ ఉద్యోగులు, వారి సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!