Ponnam Prabhakar: ఐదేళ్లలో సిరిసిల్ల నేతన్నలకు ఏం చేశావ్.. బండి సంజయ్ కు పొన్నం ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: ఐదు ఏండ్లు ఎంపీగా అధికారంలో ఉండి.. సిరిసిల్ల నేతన్నలకు ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నేత కార్మికుల కు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి పదవికి కళంకం తెచ్చే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రకటనల వల్ల బీజేపీ పడిపోతుందన్నారు. అబ్ కీ బార్ 400 సీట్లు అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించ వచ్చని, నియంత లాగ ఉండాలని చూస్తున్నారన్నారు. ఏ ఒక్క బలహీన వర్గాలు బీజేపీకి ఓటు వేస్తలేరని తెలిపారు. మంగళ సూత్రాలు గుంజుకుంటుంది అంటున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్ స్థాయికి దిగజారి పోయాడన్నారు. కోట్ల రూపాయల ఆస్తులు అదానీ, అంబానికి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Actress Rupali Ganguly: బీజేపీలో చేరిన ఫేమస్ టీవీ నటి రూపాలీ గంగూలీ
Also Read
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
మండల కమిషన్ అమలు కాకుండా చేశారన్నారు. కులగణన సర్వేకు అడ్డు చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తీసివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మన భవిష్యత్తు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకుందామన్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఎంపీ సీట్లను గెలిపించుకోవాలన్నారు.
ఎన్నికల కోడ్ ఐపోగానే ఉజ్వలమైన ప్రణాళిక రూపొందిస్తామన్నారు. 10 ఏండ్ల వరకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఐదు ఏండ్లు ఎంపీగా అధికారంలో ఉండి, బండి సంజయ్ సిరిసిల్ల నేతన్నలకు ఏం చేశావో చెప్పాలన్నారు. ఈ నెల 3న ముఖ్యమంత్రి జన జాతర సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Manda Krishna Madiga: కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..
తాజావార్తలు
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!