Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- అశ్వారావుపేటలో అభివృద్ధి పనుల ప్రారంభం
- 25 లక్షల రైతులకు రుణమాఫీ: మంత్రి
- 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
- రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదవాడి ఆశలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులను ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ , జిల్లా కలెక్టర్ అంకిత్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ , డైట్ ఛార్జీల పెంపు వంటి నిర్ణయాలతో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
పేదవాడి ఆత్మగౌరవం కోసం రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, అందులో కేవలం అశ్వారావుపేట నియోజకవర్గానికే నాలుగు వేల ఇళ్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. చివరి పేదవాడి వరకూ లబ్ధి చేకూరుస్తామని చెప్తూ, భూమి లేని పేద ఆడబిడ్డల కోసం ఐదెకరాల్లో G+3 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నాడు కేవలం పింక్ కలర్ పార్టీ వారికి మాత్రమే అందిన లబ్ధి, నేడు ప్రతి పేదవాడికి చేరుతోందని విమర్శించారు. విద్యా వ్యవస్థలో మార్పుల గురించి ప్రస్తావిస్తూ అశ్వారావుపేటలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ కులమతాలకు, పేద ధనిక తారతమ్యం లేకుండా సుమారు 2300 మంది విద్యార్థులు చదువుకుంటారని చెప్పారు. దీనితో పాటు త్వరలోనే ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అశ్వారావుపేటకు వంద పడకల ఆసుపత్రిని, నర్సింగ్ కాలేజీని మంజూరు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. స్థానికంగా కొమురం భీమ్ అర్బన్ పార్క్ ప్రారంభం, పూసుకుంట కొండ రెడ్ల కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ పేదవాడి ప్రభుత్వమని, భవిష్యత్తులో ప్రజలందరి ఆకాంక్షలను నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు , పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?