Ponguleti: సమాధానం చెప్పే రోజు వస్తుంది.. పువ్వాడ పై బగ్గుమన్న పొంగులేటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుంది. ఖమ్మంలో ఎస్.ఆర్ కాన్ వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పువ్వాడ అజయ్ కుమార్ మాటలకు పొంగులేటి సటైర్ వేశారు. నీ అవక్కులకు చవాకులు సమాధానం వస్తోందని అన్నారు. నా చిరునవ్వే పువ్వాడ అజయ్ రాజకీయ సమాధి జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. నందమూరి విగ్రహానికి పూలమాల వేస్తే పాలతో శుద్ది చేయిస్తవా? అంటూ మండిపడ్డారు. ఇది నీ సంస్కృతి నా? అని ప్రశ్నించారు. సమాధానం చెప్పే రోజు, ప్రజలు ఇస్తారు తీర్పు వస్తుందన్నారు. వడ్డీతో సహా మనం లాక్కొని తీసుకుని సమయం ఆసన్నం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నేర్పిన రాజనీతి తో నాకు బలమైన దైర్యం వచ్చిందని అన్నారు. నేను ఒక్కడిని యుద్ధం చేయలేము.. అందరం కలసి యుద్ధం చేద్దామని తెలిపారు.
Read also: Tamilnadu: హైడ్రోజన్ ఫ్యూయల్ బోట్ను రూపొందించిన విద్యార్థులు
Also Read
మనం అందరం యుద్ధం చేశామన్నారు. తండ్రితో సమానమని పార్టీలో చేరితే మనల్నే మోసం చేశారని మండిపడ్డారు. పార్టీ పదవి ఇవ్వక పోయినా తొందర పడలేదని అన్నారు. పదవి వుంటేనే ప్రజలలో వుండాలని అనుకునే వాడిని కాదని స్పష్టం చేశారు. ప్రజల అండ దండలు వుంటే ఎంత పెద్ద దానిని అయిన ఎదుర్కొంటామన్నారు. పదవి లేకపోవడం వల్లనే ఇంత మంది ప్రేమను పొందగలిగామన్నారు. రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్నానని, మూడు రోజుల్లోనే పార్టీ మార్పు వుంటుందని స్పష్టం చేశారు. మీరందరూ ఏమి కోరుకుంటున్నారో నాకు తెలుసు అని అన్నారు. ఎక్కువ సమయం తీసుకోనంటూ తెలిపారు. మూడు రోజుల్లోనే పార్టీ మార్పు వుంటుందన్నారు. ఖమ్మం నడిబొడ్డున పార్టీలో చేరుతానని అన్నారు. లక్షలాది మంది సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతానన్నారు. కేసీఆర్ పరిపాలన ను బొంద పెడతామన్నారు. మంచి పరిపాలన కోసము ప్రజాస్వామిక పార్టీలో చేరుతామన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలంటే మన వంటి మైండ్ వున్న వారిని సమికరించుకోవాలని అన్నారు. అందుకనే నిర్ణయం ఆలస్యం అయ్యిందని, చాలా మందితో చర్చలు జరిగాయని పొంగులేటి స్పష్టం చేశారు.
CM Jagan : సీఎం జగన్ను కలిసిన ఏపీ ఎన్జీవో నేతలు
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!