Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
- అసెంబ్లీ రద్దు డిమాండ్పై హరీష్రావుకు కౌంటర్
- బీజేపీ-బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని వ్యాఖ్యలు
- వారం రోజుల్లో రైతు భరోసా నిధుల హామీ
- ఇందిరమ్మ ఇళ్ల కోసం 23 స్థలాలు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : తెలంగాణలో అసెంబ్లీ రద్దుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విసిరిన సవాళ్లకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించేందుకు పూర్తి మెజారిటీతో అధికారాన్ని ఇచ్చారని, అలాంటప్పుడు దేనికోసం అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన ప్రశ్నించారు. హరీష్ రావుకు పూర్తిగా మెంటల్ బ్యాలెన్స్ తప్పడం వల్లే ఇలాంటి అర్థరహితమైన సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా చిట్చాట్లో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేక, ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాయని, ప్రతి ఎన్నికలోనూ ప్రజలు బీఆర్ఎస్కు తగిన శిక్ష వేస్తున్నారని గుర్తుచేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు.. కేటీఆర్ విమర్శలపై రియాక్షన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసే వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. కేటీఆర్ చేసే ప్రతి చిన్న విషయానికి తాను ప్రతిసారీ సమాధానం చెప్పనని, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగా బదులిస్తానని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎవరిపైనా వ్యక్తిగత కక్షలతో వ్యవహరించబోదన్నారు. ఇదే సమయంలో బీజేపీ వైఖరిని ఎండగడుతూ.. రాష్ట్రంలో అధికారం సాధిస్తామంటున్న బీజేపీది కేవలం అత్యాశ మాత్రమేనని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని ఆ పార్టీ, ఇక్కడ ప్రభుత్వం మారుస్తామని కలలు కంటోందని చమత్కరించారు. నిజానికి బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకే తాను ముక్కలని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు, థర్మల్ పవర్ ప్లాంట్ల భారీ అక్రమాలపై తాము సీబీఐ విచారణ కోరినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్పందించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
వారం రోజుల్లో రైతు భరోసా.. ఇందిరమ్మ ఇళ్లకు స్థలాల గుర్తింపు
రాష్ట్ర రైతాంగానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన భరోసా ఇచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఒకటి రెండు రోజులు ఆలస్యమైనప్పటికీ.. రాబోయే వారం రోజుల్లోనే అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులను పూర్తిగా జమ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే, నిరుపేదల సొంతింటి కల వేగంగా నెరవేర్చేందుకు గానూ మొదటి విడతలో 18 నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 23 అనువైన స్థలాలను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా ఎలాంటి రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. ఇటీవల సవరించిన భూముల ప్రభుత్వ విలువల (మార్కెట్ ధరల) నిర్ణయంలో ఎక్కడైనా వ్యత్యాసాలు లేదా పొరపాట్లు జరిగినట్లు తమ దృష్టికి వస్తే.. వాటిని పునఃపరిశీలించి తక్షణమే సవరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?