జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి ఘటన… 10 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని లిబర్టీ వద్ద జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫర్నీచర్, పూలకుండీలు ధ్వంసం చేసినందుకు 10 మంది కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి. కాగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటూ మంగళవారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ఛాంబర్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఎన్నికల కోడ్ ఉన్నందున సమావేశం నిర్వహించలేమని అధికారులు బీజేపీ నేతలకు సూచించారు.
Read Also: సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు లైన్ క్లియర్.. మరో పిటిషన్ కొట్టివేత
Also Read
అయితే అధికారులు చెప్పినా పట్టించుకోకుండా మేయర్ ఛాంబర్లోకి బీజేపీ కార్పొరేటర్లు చొచ్చుకెళ్లి ఫర్నీచర్ను ధ్వంసం చేశారని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూలకుండీలను కూడా ధ్వంసం చేశారని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!