Police Cruelty: నేలకొండపల్లిలో ఖాకీల ఓవరాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షక భటులై అర్ధ రాత్రి రోడ్డు పై వెళ్తున్న భార్యాభర్తల పట్ల అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది.. తాము భార్యాభర్తలమని చెప్పినా కనికరించలేదు. సంబంధం లేని ప్రశ్నలతో పవిత్ర బందాన్ని అభాసు పాలు చేశారు. ఈ సంఘటన నేలకొండపల్లిలో చోటుచేసుకుంది.రాజకీయ బలంతో పాటు అంగబలం, అర్థబలం ఉన్న వారి అడుగులకు మడుగులొత్తే పోలీసులు సామాన్య ప్రజానీకంపై మాత్రం వారి జులుం ప్రదర్శించడం విడ్డూరం.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని దుర్గారావు అతని భార్య భవానీ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను చూసేందుకు భార్యభర్తలతో పాటు భవానీ సోదరుడు వెంకటేష్ తో కలిసి హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామం కమలాపురం వస్తున్నారు. నేలకొండపల్లి చేరుకునే సరికి సుమారు రాత్రి 12.20 అయింది. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వారిని ఆపి సంబంధం లేని ప్రశ్నలతో ఇబ్బందులకు గురి చేశారు. ఈ సమయంలో తిరగడం ఏంటి? నీది ఏ కులం, బస్సు టికెట్లు చూపించాలంటూ నిలదీశారు. బైక్ పై వస్తున్నామని చెప్పారు. ఈమె నీ భార్య అనీ, అతను నీ భర్త అని గ్యారంటీ ఏంటని హేళనగా మాట్లాడారు. పెళ్లి ఫోటోలు, తాళి బొట్టు చూపించినా కనికరించకుండా సుమారు అర గంట పాటు వారిని మనో వేదనకు గురిచేశారు.
Also Read
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
తాము ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా అరగంట పాటు నడి రోడ్డుపై నిలబెట్టి అమర్యాదగా ప్రవర్తించిన పెట్రోలింగ్ పోలీసుల పై మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవోతో పాటు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కు బాధితులు దుర్గారావు, భవానీ ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. అలాగే ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ కు ఫిర్యాదు చేసేందుకు సీపీ కార్యాలయానికి వెళ్లారు.
రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు సిబ్బంది చీకటి వ్యాపారులతో ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిషేధిత గుట్కా, అంబర్ తో పాటు బియ్యం అక్రమ రవాణాదారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అలాగే వాహనాలు ఆపి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్న ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Police Corruption: పేకాట రాయుళ్ల పట్టివేతలో పోలీసుల చేతివాటం
తాజావార్తలు
-
Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య బలహీనత తెలిసిపోయింది.. వరుస డకౌట్స్..
-
Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
-
Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
-
Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
-
David Warner: డేవిడ్ వార్నర్కు చేదు అనుభవం.. SRH ఇలా చేస్తుందని ఊహించలేదంటూ ఆవేదన..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!