Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. రంగంలోకి సీపీ సజ్జనార్..
- కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫోన్ ట్యాపింగ్పై సిట్ కీలక సమావేశం
- ఇటీవల ఏర్పాటైన సిట్ అధికారులతో సీపీ సజ్జనార్ భేటీ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయి ఛార్జ్షీట్కు ఆదేశం
- ఫోన్ ట్యాపింగ్కు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (SIT) మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ అధికారులతో సీపీ సజ్జనార్ మొదటిసారిగా కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో కేసు పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని, వారు ఎంతటి వారైనా వదలకుండా విచారించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గత పది రోజులుగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు కస్టోడియల్ విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో అనేక విస్తుపోయే నిజాలు మరియు కీలక సమాచారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా, ఈ కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో నడుస్తున్నందున, ప్రతి అడుగులోనూ అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరించాలని మరియు ఎక్కడా చిన్న తప్పు దొర్లకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
విచారణ ప్రక్రియలో భాగంగా మొదట పూర్తిస్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిట్ కసరత్తు చేస్తోంది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన వెంటనే, ఈ కుట్రలో భాగస్వాములైన రాజకీయ ప్రముఖులను మరియు అధికారులను వరుసగా పిలిపించి విచారించనున్నారు. ఇప్పటికే సేకరించిన ఆధారాలు, టెక్నికల్ డేటా మరియు ప్రభాకర్ రావు వాంగ్మూలం ఆధారంగా తదుపరి అరెస్టులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?