TPCC Mahesh Goud : జూబ్లీహిల్స్, పంచాయతీ ఫలితాలే సాక్ష్యం..
- కేంద్ర–రాష్ట్ర పాలనపై చర్చకు సవాల్
- తెలంగాణకు కేంద్రం చేసింది ఏమిటి?
- సోనియా లేఖపై ఘాటు విమర్శ
- ఎన్నికల ఫలితాలే సాక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల ముందే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీ మేరకు 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఉద్యోగ హామీల విషయంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాయడాన్ని మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. సోనియా గాంధీని ప్రశ్నించే స్థాయి కిషన్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణపై అడుగడుగున కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చే సామర్థ్యం లేకుండా, సోనియా గాంధీకి లేఖ రాయడం నైతిక హక్కుకు విరుద్ధమని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై పక్షపాతం చూపుతోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు, మెట్రో రైలు ప్రాజెక్టు, మూసీ నది సుందరీకరణ, రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల స్థాపన వంటి కీలక అంశాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు తగిన న్యాయం చేయలేదని పేర్కొన్నారు.
Also Read
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అఖండ విజయాలే ప్రభుత్వ పనితీరుకు స్పష్టమైన నిదర్శనమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర నేతలు స్పష్టమైన సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
Bangladesh: బంగ్లా సైన్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన విషయాలు..
తాజావార్తలు
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!