Karimnagar: హుస్సేన్ పురలో పీఎఫ్ఐ కదలికలు.. ఎన్ఐఏ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: ఆగస్టు 15 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అనుమానితుల ఇళ్లపై సోదాలు చేపట్టారు. ఈనేపథ్యంలో.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్ ఐఎ సోదాలు చేపట్టారు. నగరంలోని తబ్రేజ్ అనే వ్యక్తికి నిషేదిత సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాల నేపధ్యంలో NIA సోదాలు చేస్తున్నారు. తెల్లవారు జామున 3-30 గంటలకి NIA అధికార బృందం తబ్రేజ్ ఇంటికి వచ్చారు. దాదాపు ఐదు గంటలు 8-30 వరకి తబ్రేజ్ ఇంట్లో అధికారుల సోదాలు చేశారు. అయితే దుబాయ్ లో తబ్రేజ్ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు ఐదు గంటలు NIA అధికారుల సోదాలు చేపట్టారు. తబ్రేక్ ఇంట్లో కీలక అధికారులు సేకరించినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పీఎఫ్ఐ కదలికలపై అనుమానంతో గతంలో ఎన్ఐఏ అధికారులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.
Read also: AP BJP: పంచాయితీ నిధుల కోసం కలెక్టరేట్ల ముట్టడికి బీజేపీ పిలుపు
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
సెప్టెంబర్ 18, 2022 న, NIA అధికారులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని 40 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో నలుగురిని అరెస్టు చేశారు. తెలంగాణలోని నిజామాబాద్లో పీఎఫ్ఐ కదలికలను తొలుత స్థానిక పోలీసులు గుర్తించారు. నిజామాబాద్లో వ్యాయామ శిక్షణ నిర్వహిస్తున్న ఓ ట్రైనర్ ఇంటిపై పోలీసులు దాడి చేయడంతో పీఎఫ్ఐ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా, స్థానిక పోలీసులు జూలై 4, 2022న నలుగురిని అరెస్టు చేశారు. షేక్ సహదుల్లా, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అబ్దుల్ మొబీన్ మరియు అబ్దుల్ ఖదీర్లను పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎన్ఐఏ అధికారులు పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. పలు చోట్ల పలువురిని అరెస్టు చేశారు. కాగా, తెలంగాణలో పీఎఫ్ఐ కేసును స్థానిక పోలీసులు ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసును ఎన్ఐఏ విచారించనుంది. నిజామాబాద్లో యువతను పీఎఫ్ఐ వైపు ఆకర్షించేందుకు మహ్మద్ ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆత్మరక్షణ పేరుతో యువత శిక్షణ ఇస్తూ ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Cruel Husband: భార్యను కాపురానికి పంపించలేదని.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు
- Tags
- Adilabad
- karimnagar
- NIA
- PFI
- police
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!