Pending Challans: ట్రాఫిక్ చలాన్ల రాయితీపై చెల్లింపు.. నేటితో ముగియనున్న గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pending Challans: గత ఏడాది డిసెంబర్ 27న పెండింగ్లో ఉన్న చలాన్లపై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. చలాన్ల చెల్లింపునకు జనవరి 10 వరకు గడువు ఇవ్వగా.. ఆ తర్వాత గడువును జనవరి 31 వరకు పొడిగించింది. అనంతరం ముచ్చటగా మూడోసారి ఫిబ్రవరి 15వ తేదీవరకు పొడిగిస్తూ అధికారులు ప్రకటించారు. దీంతో సబ్సిడీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు ఇవాళ (గురువారం) అర్ధరాత్రితో ముగియనుంది. పెండింగ్లో ఉన్న వాహనాల చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి గడువు పొడిగించేది లేదని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. పెండింగ్లో ఉన్న చలాన్ల చెల్లింపు గడువు నేటి అర్ధరాత్రి 11:59 గంటలతో ముగుస్తుంది. గత ఏడాది డిసెంబర్ 26 నుంచి పెండింగ్లో ఉన్న చలాన్లపై ప్రభుత్వం రాయితీని కల్పించింది. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు గడువును పొడిగించింది. ఇకపై గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలతో పాటు త్రీ వీలర్లపై 80 శాతం తగ్గింపును ప్రకటించింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60 శాతం తగ్గింపును ప్రకటించింది. ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వం 90 శాతం రాయితీ కల్పించిన విషయం తెలిసిందే..
Read also: Electoral bonds: ఇంతకీ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి..?
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
- Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్సిగ్నల్
హైదరాబాద్ నగరంలోని రాచకొండ,హైదరాబాద్,సైబరాబాద్ మూడు కమిషనరేట్లతో పాటు జిల్లా కేంద్రం నుంచి మొదలుకొని రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లతోపాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై నగరంలోని పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంది నుంచి చలాన్లు వసూలు చేస్తున్న చాలా మంది చలాన్లను తిరిగి చెల్లించడం లేదు. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో చెల్లించని చలాన్ల కారణంగా పెండింగ్లో ఉన్న చలాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కోవిడ్ కారణంగా వాహన యజమానులు పెండింగ్లో ఉన్న చలాన్లను చెల్లించలేకపోయారు. కొన్ని వాహనాలకు వాటి విలువ కంటే ఎక్కువ చలాన్లు ఉంటాయి. ఈ క్రమంలో హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మూడు కమిషనరేట్ల పరిధిలోని వాహనాలపై పెండింగ్లో ఉన్న చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది.
Chiranjeevi Political Re-Entry: సీఎం అవ్వడానికి చిరంజీవికి ఇదే చివరి అవకాశం.. ఆయన రాకపోతే..!
తాజావార్తలు
-
Ebola Vaccine: గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. ఎబోలా కొత్త స్ట్రెయిన్కు వ్యాక్సిన్!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
Cucumber Soup Recipe: 10 నిమిషాల్లో తయారయ్యే చల్లటి దోసకాయ సూప్ తాగండి.. శరీరం కూల్, ముఖం గ్లోతో మెరిసిపోతుంది!
-
Karnataka: నేడు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా! గవర్నర్ బిగ్ ట్విస్ట్..
-
Vaibhav Sooryavanshi: నేను ఆ మూడింటి పైనే ఫోకస్ చేస్తా.. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!