Telangana: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కన్న తండ్రినే కడతేర్చాడు. వివరాలలోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా లోని సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని పూసాలలో తీగల నరసయ్య తీగల రాజేశం అనే తండ్రి కొడుకుకులు నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళు పండించిన పంటను విక్రయించేందుకు పూసాలలోని ఐకెపి సెంటర్ కి తీసుకు వెళ్లారు. అనంతరం పూసాలలోని ఐకెపి సెంటర్లో ధాన్యం విక్రయిస్తుండగా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తీగల నరసయ్య కొడుకు తీగల రాజేశం ఆవేశానికి లోనైయ్యాడు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన తీగల రాజేశం ఎదురుగా ఉంది తన కన్న తండ్రి అనే విఆశయాన్ని కూడా మర్చిపోయి పక్కనే ఉన్న బండరాయితో తన తండ్రి తీగల నరసయ్య తల పైన బలంగా కొట్టాడు. దీనితో తీవ్ర రక్తస్రావానికి గురైన తీగల నరసయ్య మృతుచెందారు.
Read also:CMD Prabhakar Rao: నాకు సమాచారం లేదు.. సీఎం పిలిస్తే ఎందుకు వెళ్లను?
ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా తీగల నరసయ్య మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తరలించారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితుడు రాజేశం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉన్నారు.