CMD Prabhakar Rao: నాకు సమాచారం లేదు.. సీఎం పిలిస్తే ఎందుకు వెళ్లను?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMD Prabhakar Rao:సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి విద్యుత్ పై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యుత్ పై సమీక్షకు ట్రాన్స్ కో, జెన్కో సిఎండి ప్రభాకర్ రావు రావాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం. అయితే ఈ సమీక్షకు సీఎండి ప్రభాకర్ హాజరుకాలేదు. సీఎండి ప్రభాకర్ పై సీఎం సీరియస్ అయినట్లు వార్తలు రావడంతో సిఎండి ప్రభాకర్ రావు స్పందించారు. ఈరోజు సెక్రటేరియట్ లో విద్యుత్ శాఖ పై రివ్యూకు సంబంధించి నాకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లకుండా ఎందుకు ఉంటాను అని అన్నారు. విద్యుత్ శాఖ నుంచి కానీ, సీఎంవో నుంచి కానీ.. నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదని స్పష్టం చేశారు. నన్ను పిలిస్తే కచ్చితంగా సమావేశానికి హాజరవుతా అని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా సీఎండి ప్రభాకర్ రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Read also: Animal Movie: యానిమల్ మూవీకి అల్లు అర్జున్ రివ్యూ
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి విద్యుత్ పై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యుత్ శాఖ సమీక్షలో విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, సింగరేణి సిఎండి శ్రీధర్, విద్యుత్ శాఖ జేఎండి శ్రీనివాసరావు, ఎస్పీడిసియేఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఎన్పిడీసీఎల్ సిఎండి గోపాల్ రావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నతాధికారులు ఇచ్చారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు స్పష్టంగా ఇవ్వాలని తెలిపారు. మరోవైపు సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోనే వున్న ప్రభాకర్ రావు ఈరోజు రివ్యూకు హాజరు కాలేదు.
దీంతో సీఎం ఈరోజు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో తెలుపాలని అన్నారు. నిన్నటి నుంచి విద్యుత్ శాఖ అంశం పై సీఎం సీరియస్ గా వున్నారు. 85 వేల కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదం తెలపవద్దని సమీక్షకు ఆయన్ను కూడా పిలవాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్ రావు ఇంట్లోనే ఉన్న కూడా సమీక్ష రాకపోవడంతో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై ప్రభాకర్ రావు ఆహ్వానం అందలేదు అనడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావును పిలిచి విద్యుత్ పై చర్చ చేస్తారా? 85 వేల కోట్ల నష్టంపై వివరణ అడు లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Atchannaidu: మత్స్యకారులను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!