PDSU Leaders: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. విద్యారంగం సమస్యలపై పీడీఎస్యూ నిరసన..
- అసెంబ్లీని ముట్టడించిన పీడీఎస్యూ..
- పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని అసెంబ్లీని ముట్టడించిన పీడీఎస్యూ..
- అసెంబ్లీ వద్ద పీడీఎస్యూ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు..
PDSU Leaders: అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ రాష్ట్ర సమితి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు పెద్దఎత్తున అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు.
Read also: MLC Kavitha: ఆ.. వీడియోలు చూస్తే ప్రభుత్వం చెబుతుంది అవాస్తమని అర్థమవుతుంది..
Also Read
ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని, కార్పొరేట్ కాలేజీల మూసివేత ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పీడీఎస్యూ సంఘం నేతలను అసెంబ్లీ వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సభా ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Read also: Thiru Manickam : క్రిస్మస్ కానుకగా సముద్రఖని సినిమా రిలీజ్
మరోవైపు ఇందిరా పార్క్ వద్ద గ్రామపంచాయతీ సెక్రటరీల ఆందోళన చేపట్టారు. ఆందోళన అనుమతించి చివరి క్షణంలో అధికారులు రద్దు చేశారు. ఇందిరాపార్క్ చౌరస్తాపై గ్రామపంచాయతీలు ఆందోళనకు దిగారు. వేతన పెంపుతోపాటు.. బకాయిలు చెల్లించాలని గ్రామపంచాయతీ సెక్రటరీలు ఆందోళనకు దిగారు. దీంతో ఇందిరాపార్క్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది.
Minister Sridhar Babu: ఐటీ రంగమనేది టాలెంట్ ఆధారంగా నడుస్తుంది..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో