Pawan Kalyan: స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన ప్రమాదం దురదృష్టకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Reacts On Swapna Lok Incident: సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరమని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో పాతికేళ్లు నిండకుండానే ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఉద్యోగం కోసం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ నగరానికి వచ్చిన తెలంగాణ బిడ్డలు.. ఈ ప్రమాదంలో అశువులు బాయడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ సెంటర్లో పనిచేస్తున్న వారంతా దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారని తెలిసిందన్నారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఎలా బయటపడాలో తెలియక.. పొగతో ఉక్కిరిబిక్కిరి అయి, చివరకు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారని తెలిసి ఆవేదనకు లోనయ్యానన్నారు.
Mallikarjun Kharge: బీజేపీ వాళ్లే దేశ వ్యతిరేకులు.. బ్రిటీష్ వారి కోసం పనిచేశారు.
Also Read
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
అనేక కార్యాలయాలు, వాణిజ్య దుకాణాలు ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్లో.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూలంకషంగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఎందుకంటే.. సికింద్రాబాద్ ప్రాంతంలోనే ఇటీవలే ఒక కాంప్లెక్స్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ప్రమాదం.. మానవ తప్పిదమా? అజాగ్రత్త వల్లా? భవన నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడమా? అనేది తేలాల్సి ఉందన్నారు. కార్యాలయ సముదాయాలు, షాపింగ్ మాల్స్ను తనిఖీ చేయడంతో పాటు అక్కడి విద్యుత్ లైన్ల నిర్వహణను పరిశీలించాలని కోరారు. స్వప్న లోక్ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. అదే విధంగా.. కడుపు కోతకు గురైన కుటుంబాల వారికి తగినంత నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Phalana Abbayi Phalana Ammayi Review: ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి
కాగా.. స్వప్నలోక్ కాంప్లెక్స్లో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం కారణంగా ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉండగా.. ఇద్దరు పురుషులు ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే దట్టమైన పొగలు కమ్ముకోవడంతో.. ఊపిరాడక ఆ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుతప్రులకు తరలించారు. ఈ ఘటన పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అలాగే.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!