Mallikarjun Kharge: బీజేపీ వాళ్లే దేశ వ్యతిరేకులు.. బ్రిటీష్ వారి కోసం పనిచేశారు.
Mallikarjun Kharge: ‘జాతీయ వ్యతిరేక టూల్ కిట్’లో రాహుల్ గాంధీది శాశ్వత భాగస్వామ్యం అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే విరుచుకుపడ్డారు. బీజేపీనే దేశ వ్యతిరేకుల పార్టీ అని, వారు భారతస్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి కోసం పని చేశారని దుయ్యబట్టారు. ఇంత చేసినవారు ఇతరులను దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Driver Booked for Kissing: 18 ఏళ్ల యువతికి ముద్దుపెట్టి ఆటోడ్రైవర్ వేధింపులు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
బీజేపీ పార్టీ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తోందని, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, ప్రజాస్వామ్యం గురించి చర్చించే రాహుల్ గాంధీ వంటి వారు దేశవ్యతిరేకులా..? అని ప్రశ్నించారు. జేపీ నడ్డా చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు, రాహుల్ గాంధీ
యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదిన మరోసారి స్పష్టం చేశారు ఖర్గే. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడిపోతుందని, అందుకే పార్లమెంట్ లో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. నిజానికి ప్రధాని నరేంద్ర మోదీనే చాలా సార్లు విదేశాల్లో దేశాన్ని అవమానించారని అన్నారు.
ప్రదాని నరేంద్రమోదీ ఆరేడు దేశాల్లో పర్యటించే సందర్భంలో మాట్లాడుతూ.. వ్యాపారులు, ప్రజలు భారత్ లో పుట్టి ఏం పాపం చేశారు అని అంటున్నారని అన్నారని, ముందుగా మోదీనే దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల యూకే పర్యటనలో భాగంగా లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, మీడియా దాడులకు గురవుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుండగా, హిండన్ వ్యవహారంలో అదానీపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాలు పట్టుబడుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!