Telangana Govt: కులవృత్తులు, చేతివృత్తుల వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయంపై ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలోని కులవృత్తులు, చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కుల వృత్తులకు, చేతి వృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్ర శేఖరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మార్గదర్శకాలకు సంబంధించిన జీవోను బీసీ సంక్షేమ శాఖ తరపున జీవో ఎంఎస్ నంబర్5ను మంగళవారం జారీ చేశారు. కుటుంబంలో ఒక్కరికి రూ.లక్ష ఆర్ధిక సాయం చేయనున్నారు. జూన్ 2, 2023 నాటికి 18 నుంచి 55 ఏళ్ల వయస్సు లోపు వారు అర్హులుగా ఉత్తర్వులో పేర్కొన్నారు.
Read also: Maharashtra: విషాదం.. గోడకూలి ముగ్గురు కార్మికులు మృతి
Also Read
- Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
- KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు చేయూత నివ్వడం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా
వెనుకబడిన వర్గాలకు చెందిన కులవృత్తులు, చేతివృత్తులకు వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కుటుంబంలో ఒక్కరికి రూ. లక్ష ఆర్ధిక సాయం చేస్తారు. రూ. లక్ష ఆర్థిక సాయం పొందడం కోసం లబ్ధిదారులు జూన్ 2, 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులు. ఆర్థిక సాయం పొందాలనుకునే వారు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుండి ఆర్ధిక సాయం పొందినవారు అనర్హులు. ఆర్థిక సాయం పొందే వారి వార్షిక ఆదాయం రూ. 1 లక్ష 50 వేలు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల లోపు పట్టణ ప్రాంతాల్లో ఆదాయం ఉన్నవారు అర్హులు.
Read also: Viral Video: కేఎస్ భరత్తో అశ్విన్ రచ్చ.. తెలుగు నేర్పించాలంటూ ఓ పట్టుపట్టాడు.. వీడియో తెగ వైరల్
దరఖాస్తులను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తులను ఈనెల 6వ తేదీ నుండి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. మండలం, మున్సిపాలిటీల్లో ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్లను ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈనెల 20 వ తేదీ నుండి 26వ తేదీ లోపు పరిశీలన చేసి కలెక్టర్కు నివేదికను సమర్పిస్తారు. దరఖాస్తుల్లో అర్హులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ.. ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి ని అర్హుల జాబితాపై ఈనెల 27 నుండి వచ్చే నెల 4 లోపు అనుమతి తీసుకోవాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అప్రూవ్ చేసిన అనంతరం అర్హుల జాబితాను జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో వెబ్ సైట్ లో పొందుపర్చాలని పేర్కొంటూ ఉత్తర్వులను జారీ చేశారు.
తాజావార్తలు
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!