Telangana: నేటి నుంచే బీసీ వృత్తిదారులకు లక్ష సాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: వెనుకబడిన తరగతుల కుల, చేతివృత్తుల వారికి రూ.లక్ష సాయం నేటి నుంచి ప్రారంభం కానుంది. నియోజకవర్గానికి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందికి రూ.లక్ష ఇవ్వనున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా మంచిర్యాల వేదికగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆర్థిక సహాయం అందించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండగా.. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
Read also: White Hair: తెల్లజుట్టు నల్లగా మార్చుకోవాలంటే.. ఇలా చేయండి
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని రూపొందించింది. పనిముట్ల కొనుగోలు, ఆధునికీకరణ, ముడిసరుకు కొనుగోలుకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చాయి. బీసీ-ఏ నుంచి 2,66,001 మంది, బీసీ-బీ నుంచి 1,85,136 మంది, బీసీ-డీ నుంచి 65,310 మంది, ఎంబీసీల నుంచి 12,415 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతినెలా 5వ తేదీలోగా వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి అదే నెల 15న ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం అందజేయాలని నిర్ణయించారు. మిగిలిన దరఖాస్తుల పరిశీలన జూలై 18 నుంచి ప్రారంభమవుతుంది. రూ.లక్ష సహాయం పొందిన లబ్ధిదారులు తాము కొనుగోలు చేసిన పనిముట్లు లేదా ముడిసరుకు ఫోటోలను 30 రోజుల్లోగా అప్లోడ్ చేయాలి. ఆ యూనిట్ల గ్రౌండింగ్ను క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా వృత్తి కులాలందరికీ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చారిత్రాత్మక నిర్ణయంగా బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వృత్తుల అభివృద్ధికి, వృత్తిదారుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని కుల సంఘాల నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం పథక అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఆధునిక ఉపకరణాలు, ముడిసరుకులను కొనుగోలు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం నెరవేరాలని అన్నారు. క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా కృషి చేయాలని తెలిపారు.
Yashasvi Jaiswal Century: సురేశ్ రైనా రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్గా యశస్వి జైస్వాల్ రికార్డు!
తాజావార్తలు
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!