Telangana: నేటి నుంచే బీసీ వృత్తిదారులకు లక్ష సాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: వెనుకబడిన తరగతుల కుల, చేతివృత్తుల వారికి రూ.లక్ష సాయం నేటి నుంచి ప్రారంభం కానుంది. నియోజకవర్గానికి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందికి రూ.లక్ష ఇవ్వనున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా మంచిర్యాల వేదికగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆర్థిక సహాయం అందించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండగా.. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
Read also: White Hair: తెల్లజుట్టు నల్లగా మార్చుకోవాలంటే.. ఇలా చేయండి
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని రూపొందించింది. పనిముట్ల కొనుగోలు, ఆధునికీకరణ, ముడిసరుకు కొనుగోలుకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చాయి. బీసీ-ఏ నుంచి 2,66,001 మంది, బీసీ-బీ నుంచి 1,85,136 మంది, బీసీ-డీ నుంచి 65,310 మంది, ఎంబీసీల నుంచి 12,415 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతినెలా 5వ తేదీలోగా వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి అదే నెల 15న ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం అందజేయాలని నిర్ణయించారు. మిగిలిన దరఖాస్తుల పరిశీలన జూలై 18 నుంచి ప్రారంభమవుతుంది. రూ.లక్ష సహాయం పొందిన లబ్ధిదారులు తాము కొనుగోలు చేసిన పనిముట్లు లేదా ముడిసరుకు ఫోటోలను 30 రోజుల్లోగా అప్లోడ్ చేయాలి. ఆ యూనిట్ల గ్రౌండింగ్ను క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా వృత్తి కులాలందరికీ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చారిత్రాత్మక నిర్ణయంగా బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వృత్తుల అభివృద్ధికి, వృత్తిదారుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని కుల సంఘాల నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం పథక అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఆధునిక ఉపకరణాలు, ముడిసరుకులను కొనుగోలు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం నెరవేరాలని అన్నారు. క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా కృషి చేయాలని తెలిపారు.
Yashasvi Jaiswal Century: సురేశ్ రైనా రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్గా యశస్వి జైస్వాల్ రికార్డు!
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!