Off The Record : అధిష్టానికి కంట్లో నలుసులా.. నిత్యా తలనొప్పిగా మారిన ప్రజా ప్రతినిధులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నలుగురు….. ఎస్, ఆ నలుగురు నాయకులు. ధిక్కార స్వరాలను ఓ రేంజ్లో వినిపిస్తున్నారు. ఆ సౌండ్తో వాళ్ళున్న పార్టీలకు సైతం గూబ గుయ్మంటోంది. తమ హాట్ హాట్ కామెంట్స్తో, చేతలతో తెలంగాణ సమాజం మొత్తాన్ని తమవైపు తిప్పుకుంటున్నారు. అధిష్టానాలకు కంట్లో నలుసులా, నిత్య తలనొప్పిగా మారిన ఆ ప్రజా ప్రతినిధులు ఎవరు? ఏంటి వాళ్ళ కథా, కమామీషు? సొంత పార్టీ అగ్రనేతల్నే టార్గెట్ చేస్తాడు. కేంద్ర మంత్రి అయినా…, రాష్ట్ర అధ్యక్షుడు అయినా.. ఆ నోటికి ఒక్కటే. మైండ్లో ఏదనిపిస్తే…బ్లైండ్గా అదే మాట్లాడేస్తాడు. మేటర్ ఏదైనాసరే… మనకు సీక్రెట్స్ ఉండవు. అంతా ఓపెన్ అంటూ…బహిరంగ వేదికల మీదే చర్చిస్తాడు. చివరకు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయడానికి కూడా వెళ్ళి… అవకాశం దక్కక పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. అటు బీజేపీ కూడా…. కూడా ఇంతకాలం ఓపిగ్గా ఉండి ఉండి ఇదే అదనుగా, పార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వెంటనే రిజైన్ లెటర్ మీద స్టాంప్ వేసేసి చేతులు దులుపుకుంది. క్రమశిక్షణకు కేరాఫ్ అని చెప్పే పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తే ఏం జరుగుతుందో చేతల్లో చూపించింది బీజేపీ హైకమాండ్. ఎమ్మెల్యేగా ఉంటూ సొంత పార్టీ నేతల్ని తీవ్ర స్థాయిలో విమర్శించిన రాజాసింగ్ ఎపిసోడ్కి అలా ఎండ్ కార్ట్ వేసేసింది కాషాయ పార్టీ ఢిల్లీ నాయకత్వం. చాలా సార్లు సొంత పార్టీ నేతలపైనే సెటైర్లు వేసిన గోషామహల్ ఎమ్మెల్యే ధిక్కారస్వరాన్ని భరించినంత కాలం భరించి చివరికి వదిలించుకున్నారు బీజేపీ పెద్దలు.
బీజేపీ రెబెల్ సంగతి అలా ఉంటే…ఇటు కాంగ్రెస్ పార్టీలో మరో ఎపిసోడ్ నడుస్తోంది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నేతగా మిగిలారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనే సోషల్ మీడియా వేదికగా తప్పు పట్టారాయన. కాదు.. కాదు… ఒకరకంగా కాదు ధిక్కార స్వరం వినిపించారు. 2034 వరకు తానే సీఎం అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని, ఇది కాంగ్రెస్ విధానం కాదని సోషల్ మీడియా వేదికగా తప్పుపట్టారు రాజగోపాల్రెడ్డి. తనకు మంత్రి పదవి రాలేదన్న అసహనంతో.. ఇలా సీఎం రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసి ధిక్కార స్వరాన్ని వినిపించారన్నది కాంగ్రెస్ ఇంటర్నల్ టాక్. కానీ… ఇక్కడే పార్టీలో గతానికి భిన్నమైన వాతావరణం కనిపించింది. రాజగోపాల్ రెడ్డి స్వరం పెంచినా.. ధిక్కార సందేశం పెట్టినా… ఏ ఒక్క కాంగ్రెస్ నేతా స్పందించలేదు. ఆయన్ని సపోర్ట్ చేయలేదు. దాని గురించి కూడా చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
ఇక కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్లో ఉంటూనే ఏకంగా తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్కు పార్టీ విధానాలపై లేఖాస్త్రాన్ని సంధించారు. అక్కడితో ఆగకుండా కేసీఆర్ దేవుడేగానీ… ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని విమర్శించారామె. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని డిసైడైన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కరెక్ట్ కాదని, చట్టబద్దత కల్పించకుండా ఆర్డినెన్స్ అంటే… ఆయా కులాలను దగా చేయడమేనని అంటోంది బీఆర్ఎస్ అధినాయకత్వం. కానీ… కవిత మాత్రం ఆర్డినెన్స్ను సమర్ధించారు. పార్టీలోనే ఉంటూ విధానాలను, పార్టీ స్టాండ్ను తప్పుపడుతూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు కవిత. అయినా సరే… ఆమె మీద చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోతున్నారు కేసీఆర్.
ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఇదే బాటను ఎంచుకున్నారు. తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా లోపలి వాళ్ళే చేశారన్నది ఆయన అనుమానం. ఆ విషయంలో తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారట ఈటల. ఇటీవల తన ఇంటి దగ్గరకు వచ్చిన హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపైనే పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు మల్కాజ్గిరి ఎంపీ. ఆయన ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ని టార్గెట్ చేశారన్నది రాజకీయవర్గాల అభిప్రాయం.
ఈ నలుగురు సాదాసీదా నేతలు కాదు. రాజాసింగ్, రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కవిత మాజీ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఈటల సిట్టింగ్ ఎంపీ. వీళ్ళంతా…పార్టీల ద్వారా సంక్రమించిన పదవుల్లో ఉంటూనే… అవే పార్టీల మీదికి రాళ్ళేయడం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది. వీళ్ళని ఆయా పార్టీలు ఎలా డీల్ చేస్తాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!