Nizamsagar: తెగిన నిజాంసాగర్ కెనాల్ కట్ట.. పరుగులు తీసిన కాలనీవాసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamsagar: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ ఆనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగింది. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. నిద్రలో వున్న కాలనీ వాసులకు ఒక్కసారిగా ఇండ్లలోకి నీల్లు చేరడంతో.. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. పట్టణ కేంద్రంలో 82 -2 నిజాంసాగర్ ప్రధాన కాలువ ఉదయం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తెగిపోయింది. దీంతో జర్నలిస్ట్ కాలనీ అంతా నీట మునిగింది. దీంతో కాలనీవాసులు అందరూ ఇంటి నుంచి పరుగులు పెట్టారు. అయితే ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ స్థానికుల ఆరోపించారు. సహాయక చర్యలు మొదలుపెట్టాలని కాలనీవాసుల డిమాండ్ చేస్తున్నారు.
Read also: Rapido Cab Services: ‘ఓకే చలో’ యాప్ సేవలు.. క్యాబ్ను ఎంపిక చేసుకునే అవకాశం..!
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
దీంతో నిజాంసాగర్ ప్రధాన కాల్వలు మురికి కాలువలుగా మారి చెత్తాచెదారంతో నిండిపోయిందని, ఇరిగేషన్ అధికారుల పనితీరుపై స్థానిక కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి ప్రజలకు తాగునీరు అందించి రైతులకు సాగునీరందించారు. కాలువ తెగిపోవడంతో జర్నలిస్టు కాలనీలోకి నీరు చేరి కాలనీవాసులను భయాందోళనకు గురి చేసింది. నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలడంతో పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
Read also: MLC Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ..
జర్నలిస్ట్ కాలనీలోని ప్రధాన కాలువకు కూతవేటు దూరంలో ఉన్న ఇరిగేషన్ ఎస్సి యశస్విని, ఇరిగేషన్ ఇఎ భాను ప్రకాష్, ఇరిగేషన్ డిఇ కృష్ణమూర్తి కార్యాలయాలు శుభ్రం చేయడం లేదని నిజాంసాగర్ ప్రధాన కాలువ ఇరిగేషన్ అధికారులు లేరని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జర్నలిస్టు కాలనీ వాసులు కోరుతున్నారు. ఆర్మూరు ప్రాంతంలోని ఇరిగేషన్ అధికారులు మరి దీనిపై ఎలా స్పందిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. తెల్లవారు జామున 3 గంటలకు కెనాల్ కట్ట తెగిన ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
Viral: ఇలా తయారయ్యారు ఏంట్రా.. వీడెవడో కానీ.. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కు మధ్య తేడా ఇదంట..!
తాజావార్తలు
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!