MLC Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ..
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహాద్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ చేపట్టనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని పేర్కొంటూ ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు.
ఇక.. అదే సమయంలో సాధారణ బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టాలని కోరారు. లిక్కర్ పాలసీ కేసు విచారణలో ఉందని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈడీ వాదనలు విన్న న్యాయమూర్తి.. మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న వాయిదా వేసారు. అయితే ఈరోజు కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా? అనే దానికిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
Read also: PM Modi: నేటితో ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు.. హాజరు కానున్న ప్రధాని మోడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ మార్చి 15న హైదరాబాద్లో అరెస్టు చేసింది. మార్చి 16న ఆమె ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ 10 రోజుల కస్టడీ కోరగా, కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఆ తర్వాత మరో ఐదు రోజుల పాటు కస్టడీలో ఉంచాలని కోరగా.. మూడు రోజుల పాటు అనుమతించారు. చివరకు మార్చి 26న ఈడీ అధికారులు కవితను కోర్టులో హాజరుపరిచారు. కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు.. ఇదిలా ఉండగా, మార్చి 26న 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ సందర్భంగా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కవిత న్యాయమూర్తి కావేరీ బవేజాను కోరారు.
దీంతో ఇంటి నుంచి ఆహారం తీసుకెళ్లేందుకు, దుస్తులు ధరించేందుకు, మంగళసూత్రం ధరించేందుకు, సొంతంగా మంచాలు వేసుకునేందుకు, దుప్పట్లు, చెప్పులు ధరించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. అయితే తీహార్ జైలు అధికారులు అనుమతించడం లేదని కవిత తరపు న్యాయవాది ఈ నెల 28న మళ్లీ కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇవాళ విచారణ సందర్భంగా కవిత తరఫు న్యాయవాదులు మరోసారి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మధ్యంతర బెయిల్ మంజూరు కాకపోతే, జైలులో రిమాండ్ ముగిసే వరకు ఆ సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించాలని కోర్టును కోరవచ్చు.
PM Modi: నేటితో ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు.. హాజరు కానున్న ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!